జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా బ్రో. ఈ సినిమా కథ శుక్రవారం రోజున రిలీజ్ అయి… థియేటర్లలో ఇంకా నడుస్తుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించగా కథా మరియు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదమే స్తితం అనే సినిమాకు రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాలానికి సంబంధించిన దేవుడిగా కనిపిస్తారట.
Advertisement
అటు సాయి ధరంతేజ్ మెయిన్ హీరోగా కనిపించారు. ఇక ఇందులో కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా నటించి అందరిని మెప్పించారు. అయితే ఈ సినిమా కలెక్షన్లపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారం రేపుతోంది. ఈ సినిమా పెట్టిన బడ్జెట్కు కలెక్షన్లకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చురకలాంటించారు. పవన్ కళ్యాణ్ కు ఇచ్చే రెమ్యూనరేషన్ అంతా కూడా… బ్రో సినిమా కలెక్షన్లను రాబట్ట లేక అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు.
Advertisement
అయితే… ఇదే అదునుగా చేసుకున్న శ్రీరెడ్డి కూడా… బ్రో సినిమా కలెక్షన్లపై తన స్టైల్ లో స్పందించింది. తన శాపం వల్లే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా అట్టర్ ప్లాప్ అయిందని చురకలాంటించింది నటి శ్రీరెడ్డి. నేను పెట్టిన శాపం వల్లనే BRO సినిమా ఫ్లాప్ అయ్యిందని.. పాపం, అటు రాజకీయాల్లో ఫ్లాప్, ఇటు సినిమాల్లో ఫ్లాప్, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లుంది పవన్ కళ్యాణ్ పరిస్తితి అంటూ ఎద్దేవా చేస్తూ పోస్ట్ పెట్టింది నటి శ్రీ రెడ్డి. కాగా.. శ్రీ రెడ్డి గత కొన్ని రోజులు వైసీపీ పార్టీకి సపోర్టుగా పోస్టులు పెడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
మాకు బలుపు లేదు… కపిల్ దేవ్ కు జడేజా కౌంటర్ !
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!
Naresh: రమ్య రఘుపతికి షాక్ ఇచ్చిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి వెళ్లకుండా నిషేధం
నేను పెట్టిన శాపం వల్లనే BRO సినిమా ఫ్లాప్ అయ్యింది 😀 పాపం, అటు రాజకీయాల్లో ఫ్లాప్, ఇటు సినిమాల్లో ఫ్లాప్, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లుంది పవన్ కళ్యాణ్ పరిస్తితి 😂#Bro
— Sri Reddy (@MsSriReddy) August 3, 2023