నాని హీరోగా నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ రీసెంట్ గా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశారు. కాగా నానికి జోడీగా కృతిశెట్టి మరియు సాయి పల్లవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా విలన్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Advertisement
విలన్ మహంత్ పాత్రలో నటించిన నటుడి పేరు మనీష్ వాద్వా….కాగా ఆయన బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించారు. మనీష్ మొదటగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఆ తరవాత సీరియల్ అవకాశాలను దక్కించుకున్నారు. పలు సీరియల్స్ లో నటించి ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యంగా చాణక్యుడి పాత్రలో నటించి ఆయన ప్రేక్షకులను అలరించారు.
Advertisement
ఆ తరవాత బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన మణికర్నిక, పద్మావతి లాంటి చిత్రాల్లో నటించి అలరించారు. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాతో మనీష్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అంతే కాకుండా టాలీవుడ్ లో సినిమాలు చేయడం తన డ్రీమ్ అని మనీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్న సమయంలోనే టాలీవుడ్ లో మరో అవకాశం కూడా వచ్చిందని తెలిపారు.