Home » చిరంజీవి, నాగార్జున‌ల ల‌పై రాముల‌మ్మ‌ కౌంట‌ర్..? ప్రజల మనోభావాలు తెలియవా అంటూ..!

చిరంజీవి, నాగార్జున‌ల ల‌పై రాముల‌మ్మ‌ కౌంట‌ర్..? ప్రజల మనోభావాలు తెలియవా అంటూ..!

by AJAY
Ad

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ సినిమాను హిందీతో పాటు తమిళ‌ తెలుగు భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను చిరంజీవి సమర్పిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించడంతో నాగార్జున సైతం చిరంజీవితో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం పోస్టులు పెడుతోంది. దానికి బిజెపి నాయకురాలు విజయశాంతి సైతం సపోర్ట్ చేస్తూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ ను షేర్ చేశారు.

ఆ పోస్ట్ లో విజయశాంతి చిరంజీవి నాగార్జున లకు సైతం కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో విజయశాంతి తన పోస్టులో….”ప్రజలను అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే… ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ గారికి జనం అర్థమయ్యేలా చేస్తున్నరు. బీజేపీ సర్కారుపై గుడ్డి వ్యతిరేకతతో భారతమాతను అవమానిస్తూ 2015లో ఆమీర్ చేసిన అసహన వ్యాఖ్యల ఫలితాన్ని ఇప్పుడాయన చూస్తున్నారు. భారత్‌లో అసహనం పెరిగిపోయిందని… ఈ దేశం విడిచిపోవాలని తన భార్య ప్రతిపాదించిందని అప్పట్లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో అమీర్ అన్నారు. భారతదేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో… ఇప్పటికీ పొందుతున్నారో… చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుంది.

 

Advertisement

మనకి స్వాతంత్య్రం రావడానికి ముందు, తర్వాత, నేడు… ఎప్పుడు చూసుకున్నా ఈ దేశం మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవిస్తోంది. ఇందుకు పెద్ద ఉదాహరణ అమీర్‌తో సహా బాలీవుడ్‌లో సముచిత గౌరవం అందుకుంటున్న ఖాన్ త్రయాన్నే చెప్పుకోవచ్చు. కానీ, వాస్తవమేంటో తెలిసిన ప్రజలు అమీర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టడంతో పాటు, ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వాణిజ్య ఉత్పత్తుల్ని కూడా బహిష్కరించారు. గతంలో ఆమీర్ నటించిన పీకే సినిమాలో సైతం హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమేగాక, హిందూ దేవుళ్లని అవమానించారు. అప్పట్లో హిందూ సంస్థలు ఆ సినిమాని నిషేధించాలని కూడా డిమాండ్ చేశాయి. ఇలా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ అనే ఇన్స్‌పిరేషనల్ మూవీతో ముందుకొచ్చారు.

nagarjuna ap tickets issue

కానీ, ప్రజల్లో ఏమాత్రం స్ఫూర్తిని నింపే స్థితిలో లేని అమీర్… గతంలో చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యల్ని ప్రజలు ఆయనకి గుర్తు చేస్తూ బ‌య్ కాట్ లాల్ సింగ్ చ‌ద్దా హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందర్నీ మేలుకొలుపుతున్నరు. దురదృష్టమేంటంటే…. జనం ఇంత చైతన్యంతో వ్యవహరిస్తున్నా మన సౌత్ హీరోలు కొందరు ఆ ప్రజల మనోభావాలు తమకు తెలియదన్నట్టు , అమీర్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీ షోల్లో పాల్గొంటున్నరు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదేమో వారు ఆలోచించాలి.” అంటూ విజ‌య‌శాంతి పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇక అమీర్ సినిమా కోసం చేసిన ప్ర‌మోష‌నల్ ఈవెంట్ లో చిరంజీవి, నాగార్జున లు పాల్గొన్నారు. దాంతో వారిద్ద‌రి పై నే రావుల‌మ్మ కౌంట‌ర్ వేసిందంటూ నెటిజ‌న్లు భావిస్తున్నారు.

Visitors Are Also Reading