Home » మహిళల కోసం పోరాడే డైరెక్టరే.. మోసం చేశారంటూ కన్నీరు పెట్టుకున్న నటి.. ఎవరంటే..!!

మహిళల కోసం పోరాడే డైరెక్టరే.. మోసం చేశారంటూ కన్నీరు పెట్టుకున్న నటి.. ఎవరంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తన భర్తతో విడిపోయాక ఓ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశానని తెలిపిన నటి మోడల్ మందన కరిమీ
తాను మోసపోయానని చెప్పుకొచ్చింది. కంగనా లాకప్ షో కోసం ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు సీక్రెట్ రివీల్ ఆప్షన్ ఎంచుకున్న మందన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి బయట ప్రపంచానికి తెలియని రహస్యాలను బయట పెట్టింది. ఈ క్రమంలో మందన కరిమి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. హోస్ట్ కంగనా రనౌత్ సైతం కంటతడి పెట్టుకున్నారు. లాకప్ షో లో మందన కరిమి వెల్లడించిన సీక్రెట్ బయటికి వచ్చింది.

Advertisement

ప్రముఖ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని తర్వాత ఇల్లీగల్ ఎఫైర్ గా ముద్ర వేశారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఆమె స్టోరీ విన్న తర్వాత హోస్ట్ కంగనారనౌత్ తో సహా షోలో ఉన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే పెళ్లైన ఐదు నెలలకే వ్యక్తిగత కారణాలతో భర్త గౌరవ్ గుప్తా నుండి విడిపోయి, అదే టైం లో ఒక ఫిల్మ్ మేకర్ తో సీక్రెట్ రిలేషన్షిప్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది. నా భర్తతో విడిపోయాక నేను ఒక ప్రముఖ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్నాను. అతను ఎప్పుడూ మహిళల హక్కుల కోసం పోరాడుతూ ఉండేవాడు.

Advertisement

దీంతో అతడిపై నాకు ప్రేమ కలిగింది. అతను కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం ఒక్కటయ్యాం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసాం.ముందు దీనికి ఒప్పుకొని గర్భవతి అయ్యాక అతను నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఘటన నన్ను డిప్రెషన్ లోకి తీసుకు వెళ్లిపోయింది. ఆ సమయంలో నా స్నేహితులు,సన్నిహితులు నాకు ఎంతో ఓదార్పును ఇచ్చారు అని కన్నీరుమున్నీరైంది. ఇకపోతే మందన 2017 లో వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాను వివాహమాడింది. కొన్నేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట తర్వాత వ్యక్తిగత విభేదాల వల్ల విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మందన ను మోసం చేసిన ఆ డైరెక్టర్ ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Visitors Are Also Reading