ప్రభాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్ లు గా నటించిన సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాకు జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో మార్చి11న విడుదల చేశారు. అయితే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోనూ ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను మూట గట్టుకుంది.
Advertisement
ఇదిలా ఉండగా ఈ సినిమా త్వరలోనే ఓటిటి లో కూడా ప్రసారం కానుంది. థియేటర్ లలో ఆశించిన ఫలితం రాకపోవడం…. ఆర్ఆర్ఆర్ విడుదల తో రాధే శ్యామ్ చూసే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం తో సినిమాను ఏప్రిల్ 1నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. దాంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎప్రిల్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఓటిటి లో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Advertisement