Home » జనసేనలోకి రానున్న అంబటి రాయుడు..? అందుకే పవన్ కళ్యాణ్ తో భేటీ?

జనసేనలోకి రానున్న అంబటి రాయుడు..? అందుకే పవన్ కళ్యాణ్ తో భేటీ?

by Srilakshmi Bharathi
Ad

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొద్దీ రోజుల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన త్వరలోనే జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ లో చేరిన పదిరోజులకే అంబటి రాయుడు రాజీనామా చేసేసారు. త్వరలోనే దుబాయ్ లో టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నట్లు అంబటి ప్రకటించారు. అయితే.. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి ఆయన జనసేనలో చేరుతున్నారు అన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement

గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ ను వైసీపీ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి అంబటి రాయుడుని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అయితే.. అంబటి రాయుడు గుంటూరు నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆశించారు. అయితే.. వైసీపీ సర్వేలను చూసి.. టికెట్స్ ఇచ్చే విషయంలో జగన్ చాలా స్ట్రిక్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో అంబటి రాయుడుకి కూడా టికెట్ ఇవ్వరేమో అనుకున్నారు.

Advertisement

అయితే.. గుంటూరు టికెట్ అంబటి రాయుడుకి ఇవ్వరు అన్న సమాచారం రావడంతోనే.. అంబటి రాయుడు వైసీపీ కి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన మరో రెండు రోజుల్లో జనసేనలో చేరే అవకాశం ఉందని.. ఈ విషయమై చర్చలు జరపడానికి ఆయన పవన్ కళ్యాణ్ ను కలవనున్నారని తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన వారం లోపే అంబటి రాయుడు జనసేనలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading