Home » గుంటూరు కారం సినిమా తరువాత గురూజీ దారెటు? ఈ హీరోతో కలిసి పని చేయనున్నారంటే?

గుంటూరు కారం సినిమా తరువాత గురూజీ దారెటు? ఈ హీరోతో కలిసి పని చేయనున్నారంటే?

by Srilakshmi Bharathi
Ad

చాలా కాలం క్రితమే మొదలైన “గుంటూరు కారం” సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా పనులు పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు కుర్రాళ్ళ హృదయాలను ఉర్రుతలూగిస్తున్నాయి. ఈ సినిమా పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్ గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఆయన తదుపరి సినిమా గురించిన చర్చలు వాడివేడిగా జరుగుతున్నాయి.

Advertisement

తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వచ్చు అని చాలా మంది త్రివిక్రమ్ గారి గురించి కామెంట్స్ చేస్తున్నారు. అసలు గుంటూరు కారం సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో తీర్చి దిద్దుతున్నారు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె.. గుంటూరు కారం సినిమా పూర్తవగానే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. బన్నీ అట్లీతో సినిమా చేయనున్నారని టాక్ కూడా వచ్చింది. అప్పుడు త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తారు? అన్న డిస్కషన్ కూడా వస్తోంది.

Advertisement

దసరా, హాయ్‌ నాన్నతో సక్సెస్ అందుకున్న నాని మొన్నామధ్య ప్రమోషన్స్ లో భాగంగా ఈవెంట్స్ పాల్గొన్నప్పుడు మల్టి స్టారర్ సినిమాలు చేస్తారా? అని ఓ విలేఖరి అడగ్గా.. “త్రివిక్రమ్ గారూ.. వింటున్నారా? అంటూ తిరిగి క్వశ్చన్ చేసాడు. దీనితో నాని, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంది అని టాక్ వచ్చింది. ఇక త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో కోసం కూడా సినిమా లవర్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈసారి అంతకుమించి సినిమా రావాలి అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం తారక్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీని తరువాత వార్‌ సీక్వెల్‌ షూటింగ్‌కి వెళ్లనున్నారు. ఇది కూడా పూర్తి అయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Visitors Are Also Reading