Home » “నరసింహ” సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టె సీన్ పై రమ్యకృష్ణ రియాక్షన్ ఏంటో తెలుసా?

“నరసింహ” సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టె సీన్ పై రమ్యకృష్ణ రియాక్షన్ ఏంటో తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

రమ్యకృష్ణ హీరోయిన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రధాన పాత్రధారిగా చాలా సినిమాలలో నటించింది. వీటన్నిటిలో ది బెస్ట్ సినిమాలు అంటే మాత్రం బాహుబలి, నరసింహ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. అయితే, ఈ సినిమాలు రమ్యకృష్ణకి మంచి నటిగా పేరు తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా.. కమర్షియల్ గా కూడా మంచి విజయాలను పొందాయి. తాజాగా జైలర్ సినిమాలో కూడా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రమ్యకృష్ణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

Advertisement

నరసింహ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా అని ఆలోచించలేదని, రజినీకాంత్ నటిస్తున్న సినిమాలో భాగం అవ్వాలని మాత్రమే అనుకున్నానని రమ్యకృష్ణ అన్నారు. ఆ సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న టెన్షన్ ఉండేదన్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి చాలా భయపడ్డానని చెప్పుకొచ్చారు.

Advertisement

రజినీకాంత్ సినిమాలో ఉండాలనే ఉద్దేశయంతోనే ఆ సినిమాలో నటించాలని అనుకున్నానన్నారు. అయితే.. సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్ ముఖం పై కాలు పెడితే ఆడియన్స్ ఎలా నన్ను కొడతారేమోనని చాలా టెన్షన్ పడ్డానని చెప్పుకొచ్చారు. అయితే, ఇదొక్క సీన్ నే కదా… ఏమీ అవ్వదులే అని సౌందర్య ధైర్యం చెప్పడంతోనే ఆ సన్నివేశంలో నటించానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. ఇంకా, జైలర్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో కూడా తనకు, రజినీకాంత్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా నాకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

యవ్వనంలో ఈ 3 విషయాలకు దూరంగా ఉండండి..! అప్పుడు వృద్ధాప్యం సంతోషంగా గడిచిపోతుంది..!

బ్రహ్మ ముహూర్తంలో ఈ పనులు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు..!

భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు.. కటింగ్ అస్సలు చేయించుకోవద్దు!

Visitors Are Also Reading