Home » 450 ఎక‌రాల‌ను సంపాదించిన కాంతారావు…ఆ ఆస్తుల‌న్నీ ఎలా పొగొట్టుకున్నారంటే…?

450 ఎక‌రాల‌ను సంపాదించిన కాంతారావు…ఆ ఆస్తుల‌న్నీ ఎలా పొగొట్టుకున్నారంటే…?

by AJAY
Ad

గత కొద్ది రోజులుగా ఒకప్పటి విలక్షణ నటుడు కాంతారావు గురించి రకరకాల వార్తలు మీడియాలో చెక్కర్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం. కోట్ల రూపాయలు సంపాదించిన కాంతారావు డబ్బులు సరైన దారిలో ఖర్చుపెట్టకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ప్రస్తుతం ఆయన పిల్లలు దీనస్థితిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా కాంతారావు కుమార్తె సుశీల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

తన తండ్రి మరణం బాధాకరణమని చెప్పారు. హీరో కృష్ణ తన ఫేవరెట్ హీరో అని అన్నారు. హీరో కృష్ణ గారు అన్నా… హీరోయిన్ వాణిశ్రీ అన్నా తనకు చాలా ఇష్టమని చెప్పారు. హీరో కృష్ణ గారితో మాట్లాడాలంటే భయం ఉండేదని అన్నారు. కృష్ణ గారు కపటం లేని మనిషి అని నాన్న చెప్పేవారని సుశీల పేర్కొన్నారు. ఆన‌య‌కు ఉన్న‌న్ని అభిమాన సంఘాలు మరెవరికి లేవని సుశీల‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement

కృష్ణ గారు చనిపోయారు అన్న విషయం తెలిసి తాను చాలా బాధ‌ప‌డ్డాన‌ని ఏడుస్తూనే ఉన్నానని తెలిపారు. ఆయన చాలా సరదాగా ఉండేవారని సుశీల వెల్లడించారు. కృష్ణ గారి ప్రతి సినిమాలో తన తండ్రికి పాత్ర ఇచ్చే వారని చెప్పారు. తన తల్లిని కృష్ణ గారు చాలా స‌ర‌దాగా ఆటపట్టించేవారని అన్నారు.

తన తండ్రి సంపాదించిన ఆస్తులను తన తండ్రే అమ్మేశారని అన్నారు. తన తండ్రి ఐదు సినిమాలను నిర్మించార‌ని.. ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు నష్టాలను మిగిల్చాయని చెప్పారు. హీరో కృష్ణతో తన తండ్రి ప్రేమ జీవులు అనే సినిమాను నిర్మించగా అది ఘోరమైన ఫ్లాప్ అయిందని చెప్పారు. త‌న తండ్రి సంపాదించిన మొత్తం 450 ఎక‌రాల భూముల‌ను అమ్ముకున్నార‌ని సుశీల వెల్ల‌డించారు.

Visitors Are Also Reading