Home » ఎన్టీఆర్ క్యారెక్టర్ పై జాహ్నవి కపూర్ సంచలన వ్యాఖ్యలు….!

ఎన్టీఆర్ క్యారెక్టర్ పై జాహ్నవి కపూర్ సంచలన వ్యాఖ్యలు….!

by Bunty
Ad

జాన్వి కపూర్ ఈ అమ్మడికి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తాను నటించిన మొదటి చిత్రం ‘ధడక్’. ఆ సినిమా అనంతరం వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ అమ్మడికి ఎంతో అందం ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో పడలేదు. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు మళ్ళింది. ఏకంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది. దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వి. ఈ సినిమాకు సంబంధించి జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

Advertisement

ఈ సినిమాలో జాన్వి పల్లెటూరి అమ్మాయిల కనిపించబోతోంది. ఇక ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని, ఈ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవాలని జాన్వి కపూర్ ప్లాన్ వేసుకుంటోంది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జాన్వి కపూర్ మాట్లాడుతూ….షాకింగ్ కామెంట్స్ చేసింది. దేవర తెలుగులో నా మొదటి సినిమా. నేను తెలుగులో డైలాగ్స్ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. మా అమ్మ ఉన్నప్పుడు ఎక్కువగా మాతో హిందీలో, ఇంగ్లీష్ లోనే మాట్లాడేది.

 

మా అమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీని తన పుట్టినిల్లుగా భావించేది. అక్కడ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడేది. నేను కూడా ఈ సినిమా చేస్తున్న సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నా పుట్టినిల్లు లాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తెలిసిన వారిలాగా అనిపిస్తున్నారు. ఎందుకో తెలియదు మా అమ్మతో నాకు ఉన్న అనుబంధం వల్లేనేమో. నేను టాలీవుడ్ ఇండస్ట్రీతో చాలా దగ్గరయ్యాను. ముఖ్యంగా ఎన్టీఆర్ తో ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుందని తెలిపింది. దీంతో జాన్వి చేసిన వాక్యాలు వైరల్ గా మారాయి. దేవర రెండు పార్ట్ లుగా రాబోతోంది. మొదటి పార్ట్ 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇక రెండో పార్ట్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇక ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. జాన్వి కపూర్ ని తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారో లేదో చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading