జాన్వీ కపూర్ శుక్రవారం ఉదయం తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు.. ఆమె బాయ్ ఫ్రెండ్ గా చెప్పబడుతున్న శిఖర్ పహారియా మరియు మాజీ నటి మహేశ్వరి ఉన్నారు. జాన్వీ కపూర్ తన ఆలయ సందర్శన తర్వాత మీడియా ముందు ఫొటోస్ ఇచ్చింది. ఆ టైం లో ఆమె నవ్వుతూనే ఉన్నారు. తిరుపతి ఆలయానికి తరచూ వచ్చే జాన్వీ పండుగ తెలుపు మరియు బంగారు రంగు చీరను ధరించింది. తాజాగా.. ఇంస్టాగ్రామ్ లో సూర్యుడితో దిగిన ఫోటోలను పంచుకుంది. “ఇప్పుడు 2024 ప్రారంభమైనట్లు అనిపిస్తుంది.” అన్న కాప్షన్ ను కూడా జత చేసింది.
Advertisement
కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ 8 యొక్క తాజా ఎపిసోడ్లో శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ తన రిలేషన్ గురించి కూడా మాట్లాడింది. కరణ్ జోహార్ జాన్వీని ఇలా అడిగాడు “మీ లవ్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది.. మీరు శిఖర్ ను ప్రేమించారు. డేటింగ్ కూడా చేసారు. ఆ తరువాత మరొకరిని డేట్ చేసారు. ఇప్పుడు మళ్ళీ శిఖర్ నే ప్రేమిస్తున్నారు. ఇది నిజమేనా అని కరణ్ జోహార్ అడిగారు.
Our #Thangam #JanhviKapoor At Lord Venkateswara Swamy Temple In Tirumala Today ❤️❤️❤️.@tarak9999 #Devara #DevaraGlimpse #JrNTR pic.twitter.com/fRYloyw9pZ
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 5, 2024
దానికి సమాధానంగా జాన్వీ కపూర్.. “”నాదన్ పరిందే ఘర్ ఆజా” సాంగ్ ని మీరు విన్నారా? నాకు శిఖర్ చాలా సార్లు పాడేవాడు అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. “నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. శిఖర్ నాకోసం మాత్రమే కాదు. నా తండ్రి కోసం, నా సోదరి కోసం కూడా నిలబడతాడు. సాటి మనుషుల కోసం నిలబడే మనుషుల్ని నేనెప్పుడూ చూడని విధంగా, నిస్వార్ధంగా ఉండే వారిలో శిఖర్ ఉంటాడు.” అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు శిఖర్, జాన్వీ చాలా సార్లే కలిసి కనిపించారు. కానీ.. వీరి డేటింగ్ గురించిన వార్తలపై కచ్చితమైన సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు. అలా అని.. వీరిపై వస్తున్న రూమర్లని కూడా ఖండించలేదు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!