Home » మేము విడిపోయామని ఎలా అనుకుంటారు..? హేమా మాలిని కామెంట్స్ వైరల్..!

మేము విడిపోయామని ఎలా అనుకుంటారు..? హేమా మాలిని కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

ప్రముఖ బాలీవుడ్ నటి హేమా మాలిని గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తాజాగా ఈ నటి సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. తమ కుటుంబం గురించి ఈ మధ్యకాలంలో ప్రచారంలో వస్తున్న వార్తల గురించి హేమా మాలిని తాజాగా రియాక్ట్ అయ్యారు. తన భర్త ధర్మేంద్ర, మొదటి భార్య కుటుంబంతో తాము కలిసే ఉన్నామని ఆమె చెప్పుకొచ్చారు. మేము విడిపోయామని బయటి వాళ్లు అనుకోవడం కామెడీగా ఉందని ఆమె చెప్పకొచ్చారు.

Advertisement

ధర్మేంద్ర మొదటి భార్య కుటుంబంతో మేము ఎప్పుడూ కలిసే ఉన్నామని హేమా మాలిని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ ఫ్యామిలీ మాతోనే ఉందని హేమా మాలిని చెప్పుకొచ్చాను. కొన్ని కారణాల వల్ల మేము సన్నీ కొడుకు పెళ్లికి హాజరు కావడం సాధ్యం కాలేదని హేమా మాలిని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అది వేరే విషయం అని ఆ విషయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని ఆమె చెప్పకొచ్చారు. రక్షాబంధన్ పండుగ సమయంలో సన్నీ, బాబీ మా ఇంటికి వస్తుంటారని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

నా పిల్లలు వాళ్లకు రాఖీ కడుతుంటారని ఇది మాకు కొత్త విషయం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. హేమా మాలిని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హేమా మాలిని క్లారిటీతో ఇకనైనా ఈ కామెంట్లు  ఆగిపోతాయేమో చూడాలి. 1980 సంవత్సరంలో ధర్మేంద్ర, హేమా మాలిని వివాహం జరిగింది. ధర్మేంద్ర హేమా మాలిని ని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్ర మొదటి భార్య కుమారుడు సన్నీ ఇంట తాజాగా జరిగిన వేడుకకు హేమా మాలిని ఫ్యామిలీ హాజరు కాలేదు. హేమా మాలిని ఫ్యామిలీ తీరుపై విమర్శలు రావడంతో ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

చిరంజీవి కార్లకు 1111 అనే ప్రత్యేక నెంబర్ ఉంటుంది ఎందుకో తెలుసా ?

40 ఏళ్ల వయసుపైబడినా….పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలు !

 

Visitors Are Also Reading