Home » 50 ఏళ్ల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి.. హీరో భార్యపై ప్రశంసలు

50 ఏళ్ల వయస్సులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి.. హీరో భార్యపై ప్రశంసలు

by Anji
Published: Last Updated on
Ad

మాజీ నటి, రచయిత, స్టార్ నటుడు అక్షయ్ కుమార్  భార్య.. ట్వింకిల్‌ ఖన్నా 50 ఏళ్ల వయసులో గొప్ప మైలురాయిని సాధించింది. లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి పట్టా పొందింది. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచకున్న ఆమె.. ‘గ్రాడ్యుయేషన్ పూర్తైన రోజు. గోల్డ్‌స్మిత్స్‌లో నా మొదటి రోజు నిన్ననే అయినప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్లుగా అనిపిస్తుంది.

Advertisement

Advertisement

నా కుటుంబం నాతో ఉండడం వల్లే నా లైఫ్ ఈ రోజు నేను ఊహించిన దానికంటే మరింత పరిపూర్ణంగా మారింది. మనం ఎదగడానికి సులభమైన మార్గం ఉన్నప్పుడు ఒక దశ అడ్డుగా వస్తుంది. అయినప్పటికీ ఇతర మార్గాల్లో మనల్ని మనం నెట్టుకుంటూ ఎదగాలి’ అంటూ హ్యాపీగా ఫీల్ అయింది. ఇక దీనిపై స్పందించిన అక్షయ్ కుమార్.. ‘చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా. ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్‌, నన్ను, పిల్లలను చూసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశావ్. నేను సూపర్‌ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నీవు ఇంకా చదువుకోవాలనుకుంటున్నా.

కంగ్రాట్స్‌ మై లవ్‌’’ అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు. అలాగే పట్టా అందుకున్న ట్వింకిల్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.అయితే అక్షయ్‌ పోస్ట్‌పై స్పందించిన ట్వింకిల్‌ ఖన్నా.. ‘ఇంతగా ప్రోత్సహించే భర్తను కలిగి ఉండడం నా అదృష్టం’ అన్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ ఇద్దరినీ పొగిడేస్తున్నారు.

Visitors Are Also Reading