Home » స్కంద ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. దర్శకులు ఆ విషయంపై దృష్టి సారించాలి..!

స్కంద ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. దర్శకులు ఆ విషయంపై దృష్టి సారించాలి..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు ఆహాలో యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శకుడు అనీల్ రావిపూడితో భగవంత్ కేసరి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19 దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం తరువాత బోయపాటి దర్శకత్వంలో మరో మూవీ తీయనున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

ఇదిలా ఉంటే.. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం స్కంద. అఖండ మూవీ తరువాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ శిల్పా కళావేదికలో స్కంద ప్రీ రిలీజ్ ఈ వెంట్ నిర్వహించారు మేకర్స్.

Advertisement

ఈ వేడుకలకు నందమూరి హీరో బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్కంద ప్రీ రిలీజ్ వేడుకలో హీరోె బాలయ్య మాట్లాడుతూ.. ఈ రోజుల్లో సినిమా ఎలా ఉండాలో ప్రేక్షకులను ఎలా థియేటర్లకు రప్పించాలనే విషయంపై దర్శక, నిర్మాతలు దృష్టి సారించారు. అదేవిధంగా పలు సూచనలు కూడా చేశారు. బాలయ్య కొత్తదనాన్ని వైవిద్యతను ఆస్వాదించే అభిరుచి అభిలాష తెలుగు ప్రేక్షకుల సొంతం అన్నారు. మన సినిమాలకు దేశ, విదేశాల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారంటే.. మరణం తెలుగు ప్రేక్షకులేనని చెప్పారు హీరో బాలయ్య. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?

రోజా స్టార్ కావడానికి మీనా నే కారణమనే విషయం మీకు తెలుసా ? 

Visitors Are Also Reading