దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాధారణ ఉన్న స్టార్లలో అల్లు అర్జున్ ఒకరు. చాలా కాలం పాటు, అతను సౌత్ ఇండియన్ హీరోలలో టాప్ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఇటు కామెడీ నుంచి ఆక్షన్ సీన్స్ వరకు ప్రతి విభాగంలో అద్భుతంగా నటిస్తూ తనదయిన ముద్ర ని వేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కూడా అల్లు అర్జున్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.
ఇప్పుడు అదే ఏ నటుడూ సాధించని ఈ అరుదైన ఫీట్ని అల్లు అర్జున్ సాధించడానికి అదే అతనికి సహాయపడింది. సోషల్ మీడియా లో మహేష్ బాబు, యష్ మరియు ప్రభాస్ వంటి పెద్ద స్టార్లను అధిగమించి 15 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను చేరుకున్న మొదటి సౌత్ ఇండియన్ హీరో అయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో మహేష్ బాబుకు 7.6 మిలియన్ల మంది, ప్రభాస్కు 7.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసారు అల్లు అర్జున్
https://www.instagram.com/p/CYs2v6_MyLG/?utm_source=ig_web_copy_link
” “15 M. Thank you soo much for all the love you all shower. Humbled. Gratitude Forever. And Happy Sankranthi” అంటూ పోస్ట్ పెట్టారు. పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్.
ఇటు సౌత్ తో పాటుగా నార్త్ లో కూడా కెజిఫ్ సినిమా కలెక్షన్స్ ని దాటివేసింది పుష్ప. ఇక ఈ సినిమా కొనసాగింపుగా పుష్ప 2 ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.
Also Read: యమున నెల వ్యవధిలో రెండో టూర్..!