Home » సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు… వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు… వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

by AJAY
Ad

ఏపీలో సినిమా టికెట్ల ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు ఏపీలో ప్రభుత్వం టిక్కెట్ల ధరలను నియంత్రించే పై విమర్శలు కురిపించారు. మరికొందరు ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు. మరోవైపు పలువురు వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు సినిమా వాళ్ళు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సినిమా తారల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు వైసిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ….. సినిమా వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.

Advertisement

Nallapu reddy prasanna kumar reddy

Nallapu reddy prasanna kumar reddy

అసలు సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్ గుర్తుందా అని ప్రశ్నించారు. పెద్ద సినిమా టికెట్ ధరలను 1000 నుండి 2000 అమ్ముకుంటున్నారని ప్రసన్నకుమార్ విమర్శలు కురిపించారు. టికెట్ ధరలను తగ్గిస్తే సామాన్యులు కూడా పెద్ద సినిమాలు చూస్తారని ప్రసన్న కుమార్ రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం టిక్కెట్ ధరలను నియంత్రించండి అని దానిలో తప్పేముంది అని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి దీనిపై సినీ పెద్దలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Also read : సిద్ శ్రీరామ్ కు బంపరాఫర్…ఆ స్టార్ దర్శకుడి సినిమాలో హీరోగా ఛాన్స్…!

Visitors Are Also Reading