Home » టాలీవుడ్ లో కరోనా టెర్రర్…మరో నటుడికి పాజిటివ్…!

టాలీవుడ్ లో కరోనా టెర్రర్…మరో నటుడికి పాజిటివ్…!

by AJAY
Ad

టాలీవుడ్ లో కరోనా టెర్రర్ మళ్లీ మొదలైంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో పలువురు సినీ తారలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొంతమంది ఆసుపత్రిలో చేరగా…. మరికొంతమంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కొంత మంది ప్రముఖులను సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో పలువురు సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Rajendra prasad corona

Rajendra prasad corona

ఇప్పటికే టాలీవుడ్ నుండి మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదే విధంగా కోలీవుడ్ నుండి సత్యరాజ్ కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు మరికొంత మంది సైతం కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ నుంచి మరో ప్రముఖ నటుడు కరోనా బారిన పడినట్టు సమాచారం. నటుడు రాజేంద్రప్రసాద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

Advertisement

Visitors Are Also Reading