Home » Mar 20th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 20th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఎమ్మెల్సీ క‌విత‌ ఈడీ విచార‌ణ‌కు నేడు రెండో సారి హాజ‌ర‌య్యారు. క‌విత వెంట ఆమె భ‌ర్త అనిల్ తో పాటూ కేటీఆర్, ఎంపీ సంతోష్ లు ఉన్నారు.

Advertisement

 

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు మధ్య ఘర్షణ నెల‌కొన‌డంతో ఇద్ద‌రూ దాడి చేసుకున్నారు.

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నేడు కిసాన్‌ మహా పంచాయత్ నిర్వ‌హిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైతులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నారు.

Advertisement

తిరుమలలో 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 81,700 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జ‌రుగుతోంది. గవర్నర్ తమిళిసైపై రాష్ట్ర స‌ర్కార్ సుప్రీంను ఆశ్రయించింది.

నంద్యాల శ్రీశైలంలో వైభవంగా మొదటిరోజు ఉగాది మహోత్సవాలు జ‌రుగుతున్నాయి. మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు భ్రమరాంబికాదేవి అమ్మవారు ద‌ర్శ‌నం ఇచ్చారు.

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. గ్యాంగ్ స్ట‌ర్ నుండి స‌ల్మాన్ కు బెదిరింపులు వ‌స్తున్నాయి.

ర‌జినీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింది. బంగారంతో పాటూ ఐశ్వ‌ర్య ఇంట్లో వ‌జ్రాలు మాయ‌మ‌య్యాయి.

Visitors Are Also Reading