Home » యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం..పెద్దదిక్కు కోల్పోయిందా..?

యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం..పెద్దదిక్కు కోల్పోయిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం బుల్లితెరపై ఉన్నటువంటి స్టార్ యాంకర్లలో రష్మీ చెప్పుకోదగ్గ యాంకర్. ఆమె తన యాంకరింగ్ తోనే కాకుండా తన అంద చందాలతో మంచి గుర్తింపును సాధించింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అలాంటి రష్మీ యాంకరింగ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ను కలిగి ఉంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరినీ కలవరానికి గురిచేస్తుంది.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.. యాంకర్ రష్మీ ఇంట్లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది.

Advertisement

also read:మహిళల పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా…విద్యార్థి పై ఆకాశమే నీ హద్దురా హీరోయిన్ ఫైర్..!

యాంకర్ రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. దీంతో రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని, బరువెక్కిన గుండెతో ఫ్యామిలీ అంతా కలిసి ఆమె కడసారి వీడ్కోలు పలికామని పేర్కొంది రశ్మి.. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, మాపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని, మాకు భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు మాతో ఎప్పుడూ ఉంటాయని ఓం శాంతి అంటూ రష్మి గౌతమ్ పోస్ట్ పెట్టింది. ఈ విధంగా రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవడంతో ఆమె అభిమానులంతా కామెంట్లతో ఓదార్చే పనిలో పడ్డారు..

Advertisement

ప్రస్తుతమున్న లేడీ యాంకర్లలో అందమైన యాంకర్ రష్మీ. జబర్దస్త్ వేదికపై తనదైన పర్ఫామెన్స్ తో మంచి గుర్తింపును సాధించిందని చెప్పవచ్చు. ఆమె ఏ ఎపిసోడ్ చేసిన కొత్తగా కనిపించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉండేది. ఈ విధంగా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయింది. ఆమె యాంకరింగ్ లోనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ వస్తున్న బోలాశంకర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నట్టు సమాచారం.

also read:

Visitors Are Also Reading