Home » బాలకృష్ణ స్పెషల్ బిర్యాని 2 రూపాయలకే.. ఎక్కడంటే..?

బాలకృష్ణ స్పెషల్ బిర్యాని 2 రూపాయలకే.. ఎక్కడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.. తన తండ్రి ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఓవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయంలో ముందుకు సాగుతున్నారు. అలాంటి బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపురంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. నా తండ్రి ఎన్టీఆర్ హయాంలో చేపట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడానికి గుర్తు చేస్తూ మరొక కార్యక్రమాన్ని నిర్వహించాడు.

Advertisement

also read:ప్రతి రోజూ ఇలా స్కిప్పింగ్ చేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు..!

Advertisement

సత్య సాయి జిల్లా హిందూపురంలో అన్న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా బాలకృష్ణ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నియోజకవర్గంలో ప్రతిరోజు నిరుపేదలకు రెండు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమం ప్రారంభమై ఇప్పటికి 200 రోజులు పూర్తయింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ 500 మంది పేదలకు బిర్యానీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

దీంతో రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ, గుడ్డు,స్వీట్ అందించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రి గేట్ సమీపంలో టిడిపి నేతలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బిర్యానీ విందును ఆరేగించేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తిన్న వారంతా జై బాలయ్య జై బాలయ్య అంటూ జేజేలు పలుకుతూ తన తండ్రి ఎన్టీఆర్ ను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు.

also read:

Visitors Are Also Reading