Home » తన సినిమాలో ఆ సీన్స్ తప్పనిసరి ఉండాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!

తన సినిమాలో ఆ సీన్స్ తప్పనిసరి ఉండాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ వయసులో స్టార్ హీరోల సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కృతి శెట్టి మాత్రమే. వైష్ణవ్ తేజ్ తో జతకట్టి ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బుల్లి బ్యూటీ. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సమయంలోనే టాప్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్ళిపోయింది. దీని తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. హీరో నాని తో శ్యాం సింగరాయ్ లో నటించి మెప్పించింది.

Advertisement

అలాగే నాగార్జున తో బంగార్రాజు సినిమా లో నటించి హ్యాట్రిక్ హిట్ కొట్టి టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. కానీ రామ్ హీరోగా వచ్చిన ది వారియర్ సినిమాలో నటించి నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్యకాలంలో కోలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ కొన్ని షాకింగ్ విషయాలు బయట పెట్టింది. వరుసగా హ్యాట్రిక్ కొట్టారుగా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా..అదంతా టీం వర్క్ అని ఒక హీరో వల్ల సినిమా హిట్ అవదు అని, అలా అని ఒక హీరోయిన్ వల్ల కూడా సినిమా ఫ్లాప్ అవ్వదని, ఏం జరిగినా అది మొత్తం సినిమా టీం వల్ల జరుగుతుంది అని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక తన ప్రతీ మూవీ లో సెంటిమెంట్ సీన్స్ అంటూ ఇంట్రెస్టింగ్ మేటర్ లీక్ చేసింది. అలాగే తను నటించిన ప్రతి సినిమా లో హీరోతో కలిసి బైక్ పై షికారు కు వెళ్లే సీన్స్ ఉంటేనే తప్పకుండా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాన అని చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఇప్పటి వరకు కృతి శెట్టి నటించిన ప్రతీ సినిమాలో ఈ సీన్స్ తప్పనిసరిగా ఉన్నాయి. అయితే ఈ అమ్మడు చెప్పిన మాటలు వింటుంటే మాత్రం రాబోయే చిత్రాల్లో ఇలాంటి సీన్స్ తప్పకుండా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈమె నటిస్తున్న తర్వాతి మూవీ మాచర్ల నియోజకవర్గం ఎలాంటి హిట్ అందుకుంటుందో, అందులో బైక్ రైడింగ్ సీన్స్ ఉంటాయో లేదో ఒకవేళ ఉంటే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి.

ALSO READ;

Visitors Are Also Reading