Home » అయోమయంలో పడ్డ “ఆది పురుష్” చిత్ర యూనిట్.. కారణం ఇదేనా..?

అయోమయంలో పడ్డ “ఆది పురుష్” చిత్ర యూనిట్.. కారణం ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం నటీస్తున్న చిత్రం ‘ఆది పురుష్’.. ఈ మూవీని రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌతు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తవడంతో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే ఈ సినిమాలో రాఘవ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారట, జానకి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.అలాగే విలన్ గా లంకేశ్ పాత్రలో హిందీ స్టార్ సైఫ్ అలీ ఖాన్.. లక్ష్మణ్ పాత్రలో యువ హీరో సన్నీ సింగ్ చేస్తున్నారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి లో షూటింగ్ ప్రారంభించి, అదే ఏడాది నవంబరు నాటికి షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇదంతా ముంబైలో వేసిన స్పెషల్ సెట్స్ లో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరిగింది. అయితే ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని సమాచారం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం ఈ మూవీ లేటెస్ట్ మోషన్ కాప్షన్ టెక్నాలజీని వాడరట. ఈ మూవీ ఒకే సమయంలో తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కడం వల్ల భారీగా విఎఫ్ఎక్స్ వర్క్ అవసరమవుతోంది. అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వారి చేతిలో పబ్లిసిటీ మెటీరియల్ లేదని, అయోమయం కారణంగానే ఇంతవరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదని టాక్ వినపడుతోంది. అయితే ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు మాత్రం సరిగ్గా 8నెలల సమయం కూడా లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు చేస్తూ సినిమా గురించి ప్రచారం చేయక పోవడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

అక్కినేని ఫ్యామిలీలో ఇన్ని జంటలకు విడాకులు అయ్యాయా..? దాని వెనక కారణం అదేనా…!

“ఆర్ఆర్ఆర్” లో జక్కన్న మిస్ అయిన లాజిక్ ను గమనించారా..? మీకూ అదే డౌట్ వచ్చిందా..!

 

Visitors Are Also Reading