Home » రేవంత్ రెడ్డి ని కలిసిన దగ్గుబాటి ఫ్యామిలీ… ఆ కేసు గురించేనా..?

రేవంత్ రెడ్డి ని కలిసిన దగ్గుబాటి ఫ్యామిలీ… ఆ కేసు గురించేనా..?

by Sravya
Ad

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దగ్గుబాటి కుటుంబం కలిసింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈరోజు సినీ నటుడు వెంకటేష్ అలానే సినీ నిర్మాత సురేష్ బాబు భేటీ అయ్యారు. సీఎం కి పుష్పగుచ్చం అందించి, కాసేపు ముచ్చటించడం జరిగింది ఈ భేటీ పై సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండు నెలలు అవుతుంది తాజాగా దగ్గుబాటి కుటుంబం కలవడం మీద సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫామ్ హౌస్ కేసులో నందకుమార్ నిందితుడిగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

Advertisement

అతను బిజెపికి చెందిన వ్యక్తి అని కావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ట్రై చేసాడని కేసీఆర్ ప్రభుత్వం తరఫున అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నందకుమార్ గతంలో దగ్గుబాటి ఫ్యామిలీ తనని మోసం చేసిందని కోర్టుకు ఎక్కారు తనకి లీజుకి ఇచ్చినా భూమిని తనతో పాటు ఇంకొకరు కూడా అగ్రిమెంట్ చేసి సురేష్ బాబు వెంకటేష్ మోసం చేశారని కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా రానా పేరిట రిజిస్ట్రేషన్ చేశారని అప్పట్లో ఆరోపణలను చేశారు. ఈ విషయంలో పలుమార్లు రానా కోర్టు చుట్టు తిరుగుతున్నారు అని, ఈ కేసు వ్యవహారంలోనే సీఎం రేవంత్ ని కలిసి చర్చించినట్లు టాక్. కాంగ్రెస్ వర్గాలు అయితే కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading