Home » నేను ఇష్టపడిన వారంతా నాకు దూరం అవుతున్నారు.. విశాల్ ఎమోషనల్..!

నేను ఇష్టపడిన వారంతా నాకు దూరం అవుతున్నారు.. విశాల్ ఎమోషనల్..!

by Sravya
Ad

తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కూతురు 47 ఏళ్ల భావతరిణి క్యాన్సర్ కారణంగా శ్రీలంకలో కన్నుమూసారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదం లో మునిగిపోయారు తమిళ సినీ పరిశ్రమ అంతా ఆ కుటుంబానికి సంతాపన్ని వ్యక్తం చేస్తూ ఉండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. ఇళయరాజా కూతురు భవతరిణి మృతి పై విషయాలు ఎమోషనల్ అయిపోయారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.

Advertisement

Advertisement

నువ్వు ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావు అనుకోలేదని సోషల్ మీడియాలో రాశారు. సొంత సోదరిగా నిన్ను భావించాను. ఇప్పుడు నేను చాలా మిస్ అవుతున్నాను అని విశాల్ పేర్కొన్నారు. కొన్ని వారాలుగా నేను ఇష్టపడే వ్యక్తులు ని ఎందుకు కోల్పోతున్నానో తెలియట్లేదని అన్నారు ఇళయరాజా కూతురు గత కొన్ని ఏళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. శ్రీలంకలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది అని తెలిసిన వెంటనే రెండు రోజుల క్రితం ఇళయరాజా అన్ని పనులు ఆపేసి శ్రీలంకకి వెళ్లారు చివరి క్షణాల్లో కూడా ఆయన ఆమె పక్కనే ఉన్నారట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading