Home » నెట్టింట రౌడీ ఫ్యాన్స్ వ‌ర్స‌స్ జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ….ఆంటీ అంటూ దారుణ‌మైన ట్రోలింగ్..!

నెట్టింట రౌడీ ఫ్యాన్స్ వ‌ర్స‌స్ జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ….ఆంటీ అంటూ దారుణ‌మైన ట్రోలింగ్..!

by AJAY
Ad

సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే సెల‌బ్రెటీల‌లో అనసూయ కూడా ఒక‌రు. అనసూయ జ‌బ‌ర్ద‌స్త్ ద్వారాఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. యాంక‌ర్ గా ఎన్నో టీవీ షోల‌కు హోస్ట్ గా చేసింది. ఇక ప్ర‌స్తుతం సినిమాల‌లో ఫుల్ బిజీ అవ్వడంతో రీసెంట్ గా జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ బై చెప్పేసింది. అన‌సూయ అర్జున్ రెడ్డి సినిమా విడుద‌ల స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ వాడిన ఓ భూతు ప‌దం పై ఆగ్రహం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

త‌ల్లిని అలా అంటాడా అంటూ అన‌సూయ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వ‌రుస పోస్ట్ ల‌తో రెచ్చిపోయింది. అప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా కౌంట‌ర్ ఇచ్చారు. ఇక తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన లైగర్ సినిమా విడుద‌లై నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో అన‌సూయ‌కు మ‌రోసారి టైం వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

Advertisement

మ‌రోసారి అన‌సూయ గతంలో విజ‌య్ అలాంటి కామెంట్స్ చేయ‌డం వ‌ల్లే లైగ‌ర్ ఫ్లాప్ అయ్యిందంటూ ఇన్డైరెక్ట్ గా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాంతో విజ‌య్ ఫ్యాన్స్ అనసూయ‌ను ట్రోల్ చేస్తున్నారు. అన‌సూయ జబ‌ర్ద‌స్త్ లో చేసిన డ‌బుల్ మీనింగ్ జోకుల వీడియోల‌ను షేర్ చేస్తున్నారు.

అంతే కాకుండా ఆంటీ అంటూ అన‌సూయ కు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో అన‌సూయ ఆంటీ అంటూ త‌న‌ను.. త‌న ఫ్యామిలీ ని దూషించిన వారిపై కేసులు పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ రౌడీ హీరో ఫ్యాన్స్ త‌గ్గ‌కుండా ఆంటీ అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అన‌సూయ కూడా త‌గ్గకుండా వ‌రుస ట్వీట్స్ తో రెచ్చిపోతోంది. ఇక ఈ వివాదం ఎక్క‌డ వ‌ర‌కూ వెళుతుందో చూడాలి.

ALSO READ : రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆ హీరోయిన్ గాడంగా ప్రేమించుకున్నారా.? అప్ప‌ట్లో ఆ వార్త‌లు ఎందుకు వ‌చ్చాయి..?

Visitors Are Also Reading