Home » దొంగ ఓట్లు తో లబ్ది పొందాలని వైసీపీ చూస్తోంది: పురందేశ్వరి

దొంగ ఓట్లు తో లబ్ది పొందాలని వైసీపీ చూస్తోంది: పురందేశ్వరి

by Sravya
Ad

రాష్ట్రం లోని అధికారులతో కుమ్మక్కై అధికార వైసిపి భారీ ఎత్తున దొంగ ఓట్లని నమోదు చేస్తుందని అయితే అవి సీఎం జగన్ లబ్ది పొందాలని చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సీఎం జగన్ వై నాట్ 175 వెనుక పెద్ద స్కెచ్ ఉందని ఆమె చెప్పారు. ఓటర్ల నమోదు ఎప్పుడూ లేని విధంగా వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఊరు పేరు లేని వ్యక్తుల పేరిట దొంగ ఓట్లు నమోదు చేయించి ఓటర్ ఐడి లని కూడా తీసుకుంటున్నారని ఆరోపించారు.

Advertisement

Advertisement

తిరుపతి ఉప ఎన్నికల్లో 35వేల దొంగ ఓట్లు వేయించారని ఆమె అన్నారు. మరోసారి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని జగన్ ఆరాటపడుతున్నారని ఆమె అన్నారు. దొంగ ఓట్ల విషయంలో ప్రజలకి అసలు విషయాలు చెప్తామని ఆమె అన్నారు. రాష్ట్రం లో పలు జిల్లాల అభివృద్ధికి కేంద్రం కోట్లు మంజూరు చేస్తుందని తమ ప్రభుత్వ సహకారం లేకుండా చేసిన పనులు ఒకటి కూడా లేదని విమర్శించారు పురందేశ్వరి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading