Home » అందుకే సినిమాలను వదిలేసాను.. నాగార్జున హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

అందుకే సినిమాలను వదిలేసాను.. నాగార్జున హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

by Sravya
Ad

ఇండస్ట్రీ లోకి గొప్ప నటులు అవ్వాలని, చాలామంది హీరోలు హీరోయిన్లు వస్తూ ఉంటారు కానీ అందరికీ కలిసి రాదు. కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున సరసన మన్మధుడు సినిమాలో నటించిన అన్షు అంబానీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె పలు సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అన్షు అంబానీ ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో నటించింది తమిళ్ సినిమా జై లో కూడా ఈమె ప్రధాన పాత్ర పోషించింది తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించింది అన్షు.

Advertisement

ఇప్పుడు ప్రస్తుతం ఈమె కుటుంబంతో పాటుగా లండన్ లో ఉంటుంది ఇటీవల మన్మధుడు కి సంబంధించి వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది అన్షు దీంతో అందరూ అన్షు మళ్ళీ ఇండస్ట్రీ లోకి వచ్చిందని భావించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అన్షు కనిపించే సరికి అభిమానులు అందరూ కూడా ఆనందించారు. నాగార్జునతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలని ఆమె అప్పట్లో నెమరువేసుకుంది. మన్మధుడు తర్వాత అన్షు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమా చేసింది.

Advertisement

చివరికి ఆమె చదువుల కోసం అని లండన్ వెళ్ళింది వ్యాపారవేత్త సచిన్ ని పెళ్లి చేసుకుంది బ్రిటన్ రాజధాని నగరంలో లండన్ లో స్థిరపడింది. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంది అయితే ఈమె త్వరలోనే మళ్లీ ఇండస్ట్రీలోకి రాబోతుందని అంతా అంటున్నారు. ఏదైనా క్రేజీ ప్రాజెక్టులలో నటించచ్చని టాక్. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈమె సినిమాలని వదిలేసింది. ఎందుకు వదిలేసింది అనే ప్రశ్నకి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సమాధానం చెప్పారు కెరియర్ ఆరంభం తాను చేసిన పాత్రలన్నీ సెకండ్ హీరోయిన్వి కావడంతో వాటితో విసికొచ్చి సినిమాలని వదిలేసి వెళ్ళిపోయిందిట దానికంటే సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండటమే నయమని ఆమె భావించారట అందుకనే ఇండస్ట్రీని విడిచిపెట్టి అన్షు దూరంగా ఉండిపోయిందట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading