Home » ఎంపీ ఎన్నికల తరవాత పార్టీ లో ఉండేది కేసీఆర్ ఫ్యామిలీనే: మంత్రి జూపల్లి

ఎంపీ ఎన్నికల తరవాత పార్టీ లో ఉండేది కేసీఆర్ ఫ్యామిలీనే: మంత్రి జూపల్లి

by Sravya
Ad

తాజాగా KCR గురించి కెసిఆర్ పార్టీ గురించి మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని.. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ ని నెరవేర్చి తీరుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు ప్రజాపాలనికి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. దరఖాస్తుల డిజిటల్ ప్రక్రియ కొనసాగుతుందని ఇది పూర్తయిన తర్వాత 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి రెండు హామీలను నెరవేర్చారని చెప్పారు.

Advertisement

Advertisement

రెండు హామీలను అమలు చేస్తే బిఆర్ఎస్ నాయకులు భయపడ్డారని ఇంకా మిగతా హామీలు అమలు చేస్తే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారని ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవుతుందని ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు తిరగబడతారని బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. సొంత పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారని ఆ పార్టీని విడిచి పెడుతున్నారని అన్నారు. ఎన్నికలు తరవాత అందరు వెళ్ళిపోతారని కేవలం కెసిఆర్ కుటుంబం తప్ప ఒకరు కూడా మిగలరని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading