Home » ఏపీ కేబినెట్ భేటీలో.. కీలక నిర్ణయాలు..!

ఏపీ కేబినెట్ భేటీలో.. కీలక నిర్ణయాలు..!

by Sravya
Ad

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అయింది. మంత్రి మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదంని మంత్రిమండలి తెలిపింది. డాక్టర్ వైయస్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పని చేయనుంది. నంద్యాల జిల్లా డోన్ లో వ్యవసాయ రంగంలో రెండేళ్లు డిప్లమో కోర్స్ తో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ని ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Advertisement

Cm Jagan

రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీల ఏర్పాటుకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య యూనివర్సిటీ కి కూడా ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ శాసన సభ లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Advertisement

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading