Home » నేను జోక్ చేశా.. సారీ సైనా..సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణలు…!

నేను జోక్ చేశా.. సారీ సైనా..సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణలు…!

by AJAY
Ad

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చేసిన ఓ ట్వీట్ కు సిద్ధార్థ్ డబల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకర కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సిద్దార్థ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సింగర్ చిన్మయి, కుష్బూ లు ట్విట్టర్ వేదికగా సిద్ధార్థ్ ను ఏకిపారేసారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సిద్ధార్థ్ చేసిన పనిని తప్పుపట్టారు. అంతేకాకుండా కొంత మంది నెటిజన్లు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలతో అతడికి పిచ్చి పట్టింది అంటూ కామెంట్ చేశారు. అంతే కాకుండా సైనా నెహ్వాల్ తండ్రి సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Siddarth Saina Nehwal

Siddarth Saina Nehwal

ఇక భారీ విమర్శల నేపథ్యంలో సిద్ధార్థ్ తాజాగా సైనా నెహ్వాల్ కు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. “కొద్దిరోజుల కిందట మీరు చేసిన ట్వీట్ కు స్పందిస్తూ నేను అసభ్యకరమైన జోక్ చేశాను. దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. మీతో చాలా అంశాలను ఏకీభవించలేదు. అసంతృప్తి కూడా వ్యక్తం చేశాను. కానీ మీ ట్వీట్ చూసిన తర్వాత ఆగ్రహంతో నేను స్పందించిన తీరు మరియు వాడిన భాష సరైనది కాదు.

Advertisement

Advertisement

Also read : కరోనాతో ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని, వంగవీటి రాధా..!

నేను జోక్ చేశాను కానీ ఎలాంటి దురుద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేయలేదు. నేను మహిళలను గౌరవిస్తాను. మహిళలపై ఎలాంటి లింగవివక్ష చూపించలేదు. మహిళ కాబట్టి మీ మీద దాడి చేయాలని ఉద్దేశం ఏమాత్రమూ లేదు. ఇక ఇంతటితో మనం ఈ విషయాన్ని వదిలేద్దాం. మీరు నా లేఖను అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడూ నా ఛాంపియన్…. నిజాయితీతో మీ సిద్ధార్థ్.” అంటూ సిద్దార్థ్ తన లేఖలో పేర్కొన్నారు. మరి సిద్ధార్థ్ ను సైనా నెహ్వాల్ క్షమస్తుందా లేదా అన్నది చూడాలి.

Visitors Are Also Reading