Home » దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా…!

దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా…!

by Bunty
Ad

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో అల్లు అర్జున్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచమంతటా వ్యాపించింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే రిలీజ్ కు సిద్ధం కాబోతోంది. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అల్లు అర్జున్, హన్సిక కలిసి జంటగా నటించిన చిత్రం దేశముదురు. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Advertisement

ఈ మూవీని కేవలం 10 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే 26 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇందులో హన్సిక కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తన అమాయకమైన మాటలతో, అందంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఈ సినిమాలో మొదటగా అల్లు అర్జున్ ను కాకుండా హీరో సుమంత్ ను అనుకున్నారట. ఈ సినిమా స్టోరీ సుమంత్ కు నచ్చకపోవడంతో నో చెప్పారట. దీంతో పూరి జగన్నాథ్ ఈ సినిమా కథను అల్లు అర్జున్ కు వినిపించారట. ఈ కథ తనకు నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పారట. దీంతో ఈ సినిమాలో నటించి భారీ హిట్ కొట్టారు అల్లు అర్జున్.

Advertisement

కాగా, అల్లు అర్జున్ రీసెంట్ గా AAA సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు. బయట వాటితో చూసుకుంటే ఇందులో అన్నింటికీ రేట్లు చాలా తక్కువగా ఉండడం గమనార్హం. సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ దీనిని స్థాపించారు. అల్లు అర్జున్ గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అయ్యారు. కాగా, అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. అల్లు అర్హ, అయాన్. అర్హ అతి చిన్న వయసులోనే సినిమాలలో నటించడం గమనార్హం. తన ముద్దు ముద్దు మాటలతో శాకుంతలం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అర్హ. తండ్రికి తగ్గ కూతురు గా పేరు సంపాదించుకుంటుంది అర్హ. పలు రకాల సినిమాలలో కూడా అర్హకి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?

టీమిండియా నుంచి ఔట్‌.. పుజారా సంచలన నిర్ణయం

Samantha : మళ్లీ లవ్ లో పడ్డ హీరోయిన్ సమంత.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading