Home » మ‌రో వివాదంలో స‌న్నీలియోన్ సాంగ్ !

మ‌రో వివాదంలో స‌న్నీలియోన్ సాంగ్ !

by Bunty
Ad

బాలీవుడ్ నటి సన్నీలియోన్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఆల్బమ్స్ తో బాగా బిజీ అయిపోయింది. తాజాగా ఈమె కనికా కపూర్ పాడిన పాటలో నటించింది. బుధవారం నాడు ఈ పాటను విడుదల చేశారు. అయితే ఈ పాట చేసిన నెటిజన్లు సన్నీలియోన్ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో సన్నీలియోన్ ను బాగా రోల్ చేస్తున్నారు. ఈ పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాహిత్యం ఉందని.. అలానే సన్నీలియోన్ గోల్డ్ ఫార్మా పర్ఫామెన్స్ మరింత కించపరిచేలా ఉందని ఆమెపై ఫైర్ అవుతున్నారు. రాధా నర్తకి కాదు.. భక్తురాలు.. మధుబన్ పవిత్ర ప్రదేశం.

Advertisement

Advertisement

రాధా మధుబన్ లో ఇలా డాన్స్ చేయలేదు. ఇది సిగ్గుపడే సాహిత్యం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దేవుడిని కించపరిచే హక్కు నీకు లేదు అంటావు సన్నీలియోన్ పై మండిపడుతున్నారు. హిందూ సాంప్రదాయాలు, విలువలు మరింత దిగజారి పోయేలా సినిమా వాళ్లు వ్యవహరిస్తున్నారని.. నీతులు తెరపై చెప్పడం కాదని.. ఆచరణలో పెట్టాలంటే కౌంటర్లు వేసుకున్నారు.

READ ALSO :  రైల్వే ప్లాట్ ఫామ్ పైన ప‌సుపు రంగు గీత‌లు ఎందుకు ఉంటాయో తెలుసా?

ఈ పాటను వెంటనే తొలగించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే పరిమాణాలు కటినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి సన్నీ లియోన్ నటించిన ఈ పాట వివాదాస్పదమవుతోంది. ఈ పాటను షరీఫ్ తోషి స్వరపరచగా.. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. సన్నీలియోన్ ట్విటర్లో షేర్ చేసిన ఈ పాట పై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి.

Visitors Are Also Reading