Home » నమ్రతా పెళ్లి విషయంలో కృష్ణ మహేష్ బాబును అడిగిన ఒకే ఒక ప్రశ్న.. ఏంటంటే..?

నమ్రతా పెళ్లి విషయంలో కృష్ణ మహేష్ బాబును అడిగిన ఒకే ఒక ప్రశ్న.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈమధ్య చాలా ఇండస్ట్రీలలో హీరో హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం కామన్ అయిపోయింది. ఒక హీరోతో సినిమాలో నటించి ఆ టైంలోనే ఆ హీరో పై ప్రేమ పెంచుకొని చివరికి ఆ హీరోనే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు అనేకమంది ఉన్నారు. కొంతమంది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే మరి కొంత మంది పెద్దలను కాదని వివాహం చేసుకొని జీవితాన్ని గడుపుతున్నవారు ఉన్నారు. ఇందులో మరీ ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారు.

Advertisement

also read:రూ.26.30కే దాల్ మఖాని, షాహి పనీర్, రోటితో సహా ఇతర వంటకాలు.. ఎక్కడంటే..?

ఏది ఏమైనా ఇలా హీరోయిన్లను పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు కూడా ఒకరు. మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సమయంలో నమ్రత స్టార్ హీరోయిన్.. హిందీలో అప్పటికే చాలా సినిమాలు చేసింది. అయితే టాలీవుడ్ లో వీరిద్దరూ వంశీ సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మరడంతో కొన్ని ఏళ్లపాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పారు..

Advertisement

కానీ మొదట్లో కృష్ణ గారు నమ్రతతో పెళ్లిని వ్యతిరేకించారు.. కానీ మహేష్ బాబు పట్టిన పట్టు విడవకపోవడంతో ఓకే అనేశారు. కానీ కృష్ణ ఒకే ఒక ప్రశ్న మహేష్ బాబుని అడిగారు. అదేంటయ్యా అంటే.. “ఆర్ యు షూర్ మహేష్”.. నీకు అమ్మాయి ఓకేనా అని అడిగారట.. దీంతో గట్టిగానే నాకు అమ్మాయి ఓకే.. నాకు సెట్ అవుతుందని భావిస్తున్నానని సమాధానం ఇచ్చారట. దీంతో కృష్ణ కూడా ఒప్పుకున్నారు. దీంతో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి దగ్గరుండి కృష్ణతో కలిసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

also read:

Visitors Are Also Reading