Home » పాడ్స్, గ్లోవ్స్ వేసుకొని క్రికెట్ ఆడుతున్న జాన్వీపై దారుణమైన ట్రోల్స్..!

పాడ్స్, గ్లోవ్స్ వేసుకొని క్రికెట్ ఆడుతున్న జాన్వీపై దారుణమైన ట్రోల్స్..!

by Azhar
Ad
బాలీవుడ్ లో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయం. అయితే దీని పై అక్కడి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా సీరియస్ అవుతూనే ఉంటారు. అయిన కూడా అది తగ్గడం లేదు. ఇక ఇలా వారసత్వంగా సినిమాలోకి వచ్చిన హీరోయిన్ జాన్వీ కపూర్. శ్రీదేవి, బోని కపూర్ కూతురిగా సినిమాలోకి వచ్చిన జాన్వీ కపూర్.. ఇప్పుడు తనకంటూ సొంత స్టార్ డమ్ ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది.
అయితే బాలీవుడ్ లో అందరి హీరోయిన్స్ కంటే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యే గుడ్ లక్ జెర్రీ అనే సినిమా చేసిన జాన్వీ కపూర్ కొత్తగా చేస్తున్న  మిస్టర్ & మిసెస్ మహి సినిమాలో క్రికెటర్ రోల్ లో కనిపించనుంది. అందుకోసమే ఆమె నెట్స్ లో పాడ్స్, గ్లోవ్స్ వేసుకొని క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఇక దీనిపై విపరీతమైన ట్రోలింగ్ అనేది జరుగుతుంది. ఆ వీడియోలో క్రికెట్ షాట్స్ ఆడుతున్న జాన్వీని చూసి.. నువ్వు ముందు బరువు తగ్గాలి అని సూచిస్తున్నారు. నెట్స్ ఆమె చాలా నెమ్మదిగా కదలడం పై కూడా మిమ్స్ అనేవి ట్రెండ్ చేస్తున్నారు. అలాగే పాడ్స్, గ్లోవ్స్ వేసుకొని టెన్నిస్ బాల్ తో జాన్వీ ప్రాక్టీస్ చేయడం కూడా ట్రోలర్స్ కు అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. అయితే ఈ ట్రోలింగ్ వల్లే ప్రస్తుతం జాన్వీ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading