Home » ఒక సీరియ‌ల్ విష‌యంలో…. ఇద్ద‌రు హీరోయిన్స్ మ‌ధ్య సైలెంట్ వార్!

ఒక సీరియ‌ల్ విష‌యంలో…. ఇద్ద‌రు హీరోయిన్స్ మ‌ధ్య సైలెంట్ వార్!

by Azhar

సినిమాల్లో హీరోయిన్స్ మధ్య చిన్న చిన్న గొడవలు కామ‌న్! కాక‌పోతే ఇమేజ్ కోసం ఆ గొడ‌వ‌లు బయటపడకుండా చూసుకుంటుంటారు. అలాంటి సైలెంట్ వార్ ఒక‌టి ….ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ రాధికా, సరితల మధ్య నడిచింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ రాధికా, సరితల మధ్యల మ‌ద్య ఓ సైలెంట్ వార్ నడిచింది. అదెలా స్టార్ట్ అయ్యిందంటే….రాధిక, సరిత కలిసి తమిళంలో సెల్వి సీరియల్ లో నటించారు. అది తెలుగులో లక్ష్మి పేరిట ప్రసారం అయింది. ఈ సీరియ‌ల్‌లో ఇంచుమించు ఇద్దరి పాత్ర‌లు స‌మానంగా వున్నాయి. అయితే ఆ సీరియ‌ల్ సమయానికి సరిత సినీ ఛాన్స్ లు పూర్తిగా తగ్గిపోయాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిన సరిత అప్పట్లో సౌందర్యకు డబ్బింగ్ చెప్పేవారు. అయితే ఆమె చనిపోయాక అది కూడా మిస్సయింది.

దీంతో ఆర్ధిక కష్టాలు వెంటాడంతో రాధిక నిర్మించే లక్ష్మి సీరియల్ లో నటించడానికి ఒప్పుకున్నారు. అయితే రోజుకి 30వేలరూపాయలు డిమాండ్ చేసింది. పైగా బోల్డన్ని కండీషన్స్ విధించింది. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకే షూటింగ్ లో ఉంటానని, బయట షూటింగ్స్ కి రానని చెప్పడంతో రాధికతో మేనేజర్ విషయం వివరించాడు. అయితే ఆపాత్రకు ఆమెని సెలెక్ట్ చేయాలని రాధిక స్పష్టం చేయడంతో మేనేజరు అన్ని కండిషన్స్ కి ఒప్పుకుని సరిత నటించేలా ఒప్పించాడు.

కొన్నాళ్ల వరకూ షూటింగ్ బానే నడిచింది. అందరూ బానే పలకరించుకున్నారు. ఇక అసలు గొడవ ఎప్పుడు మొద‌ల‌యిందంటే… వీరిద్ద‌రి మ‌ధ్య‌ ఇగోలు పెరిగాయి. నా పాత్రకు ప్రాముఖ్యత లేదని సరిత చెబుతూ, ఇలా చేస్తే, నా అభిమానులు ఫీలవుతారని వాదించింది. అంతేకాదు, నేను రాధిక కన్నా సీనియర్ నటిన‌ని, నాపేరు ముందు వేయకుండా రాధిక తర్వాత వేస్తున్నారేమిటని మరో సందర్భంలో గొడవకు దిగిందట‌!

ఇక డబ్బింగ్ కూడా చెప్పడానికి తీరిక లేదని సరిత అనడంతో, ఆమె పాత్రను కోమాలోకి వెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే ఇలా నా పాత్రను కోమాలోకి పంపుతారా అంటూ సరిత రచ్చరచ్చ చేసేసిందట‌. కోమాలోకి ఆపాత్ర వెళ్లిపోవడంతో సీరియల్ రేటింగ్ కూడా పడిపోయి, ఆపేసే దాకా వెళ్ళింది.

Visitors Are Also Reading