Home » మహేష్ బాటలోనే మమ్ముట్టి, కిచ్చ సుదీప్.. ఐదు సెకండ్లకు ఇన్ని కోట్లా..?

మహేష్ బాటలోనే మమ్ముట్టి, కిచ్చ సుదీప్.. ఐదు సెకండ్లకు ఇన్ని కోట్లా..?

by Sravya
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఫోన్ పే కోసం తన వాయిస్ ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకి చేసిన డిజిటల్ చెల్లింపులు కోసం వాయిస్ ని అందించిన మొదటి సౌత్ ఇండియన్ సెలబ్రెటీగా మహేష్ బాబు నిలిచారు. అయితే ఇప్పుడు అదే బాట లో ఇద్దరు సూపర్ స్టార్లు కూడా నడుస్తున్నారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కన్నడ సూపర్ స్టార్ కృష్ణ సుదీప్ కూడా ఫోన్ పే చెల్లింపుల కోసం వాయిస్ ని ఇస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఐదు సెకండ్ల వాయిస్ కోసం మహేష్ బాబు ఐదు కోట్ల రూపాయలని చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇప్పుడు మమ్ముట్టి, కిచ్చా సుదీప్ కూడా అదే దారిలో వెళ్తున్నారు దాదాపు అదే రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అమితాబచ్చన్ మహేష్ కంటే ముందు ఫోన్ పే కి ఇలా వాయిస్ ఇచ్చారు. 2023లోనే అమితాబ్ తన వాయిస్ ని ఇచ్చారు. కెరియర్ విషయానికి వచ్చేస్తే.. మమ్ముట్టి నటించిన భ్రమయుగం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది.

Advertisement

ఈ సినిమా 50 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది. మమ్ముట్టి నటన కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు విమర్శకులు కూడా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఇక మహేష్ బాబు అయితే రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ హిట్ కొట్టినంత గా హిట్ కొడతారని మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతలా మెప్పిస్తారు అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading