Home » ఏపీ అసెంబ్లీ లో ఉద్రిక్తత.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సర్పంచులు..!

ఏపీ అసెంబ్లీ లో ఉద్రిక్తత.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సర్పంచులు..!

by Sravya
Ad

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రత వాతావరణం చోటు చేసుకుంది. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచ్లు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వగానే ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. గ్రామ పంచాయతీ నిధులు సచివాలయ కార్యదర్శులకు కాకుండా తమకి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సర్పంచ్లు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సర్పంచ్లను అడ్డుకున్నారు అయితే ఈ క్రమంలోనే పోలీసులు సర్పంచ్లకి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.

Advertisement

Advertisement

దీనితో పలువురు సర్పంచులని అదుపు తీసుకున్న పోలీసులు వాళ్ళ వాహనాల్లో అక్కడి నుండి తరలిస్తున్నారు అసెంబ్లీ ముందు సర్పంచుల ఆందోళన చేస్తుంటే లోపల టిడిపి ఎమ్మెల్యేల నిరసనతో ఒక్కసారిగా ఏపీ అసెంబ్లీ హీట్ ఎక్కింది. ఎన్నికలవేళ సర్పంచ్లు ఏకంగా అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇలా అసెంబ్లీ వద్ద సర్పంచులు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అంతా దీని గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading