Home » రైతుల సంక్షేమం కోసం జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు: MLA కేపీ నాగార్జున రెడ్డి

రైతుల సంక్షేమం కోసం జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు: MLA కేపీ నాగార్జున రెడ్డి

by Sravya
Ad

సీఎం జగన్ పై ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రైతుల సంక్షేమానికి జగన్ ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చారని నాగార్జున రెడ్డి అన్నారు. శుక్రవారం మార్కాపురం ఎంపీసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈయన హాజరయ్యారు. చైర్మన్ డాక్టర్ షంషేర్ అలీ బేగ్, వైస్ చైర్మన్ గా మురళి డైరెక్టర్లుగా, లక్ష్మీ ప్రసాద్ యాదవ్, డాక్టర్ మక్బూల్ బాషా తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడ్డం జరిగింది.

Advertisement

Advertisement

ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడంతో పాటుగా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పారు. నూతన పాలక మండలి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మార్కెట్ యార్డ్ లో 78 లక్షలతో నూతన ఏఎంసి భవన నిర్మాణని ఎమ్మెల్యే కేపీ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading