Home » హైదరాబాద్ లో విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ కిందపడి మృతి..!

హైదరాబాద్ లో విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ కిందపడి మృతి..!

by Sravya
Ad

హైదరాబాద్లో ఇంకో విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి వేళ హైదరాబాదు లో గాలిపటాల కారణంగా పలు మరణాలు చోటుచేసుకున్నాయి. పండుగ సంబరాలకి ఇంకో ప్రాణం బలైపోయింది. లంగర్ హౌస్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ కి జరిగిన విషయాన్ని మరిచిపోక ముందే మరో యువకుడు ప్రాణాన్ని కోల్పోయాడు. మేడ్చల్ జిల్లాలో ఇది చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లాలోని అల్వాల్ కి చెందిన ఆకాష్ 20 గాలిపటాన్ని ఎగురవేస్తూ ప్రమాదశాత్తు బిల్డింగ్ పై నుండి కింద పడిపోయాడు.

Advertisement

Advertisement

ఒక్కసారిగా బిల్డింగ్ పై నుండి కింద పడిపోవడంతో మృతి చెందాడు పోలీసుల కి సమాచారాన్ని ఇచ్చారు. బషీరాబాద్ పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తుని వదిలిపెట్టారు. ASI విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ కొడుకుగా పోలీసులు గుర్తించారు. పండగ వేళ అప్పటి దాకా సంతోషంగా ఉన్న ఫ్యామిలీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. కొడుకు మరణ వార్తని తట్టుకోలేక ఏఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇది ఇలా ఉంటే సహ ఉద్యోగి కొడుకు మృతి చెందడంతో అల్వాల్ పోలీస్ స్టేషన్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading