Home » సూప‌ర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్ద‌ల‌తో గొడ‌వ‌ప‌డ్డ వైఎస్ఆర్…? ఎందుకు గొడ‌వ‌ప‌డ్డారంటే..?

సూప‌ర్ స్టార్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్ద‌ల‌తో గొడ‌వ‌ప‌డ్డ వైఎస్ఆర్…? ఎందుకు గొడ‌వ‌ప‌డ్డారంటే..?

by AJAY
Ad

సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే వార్తను ఆయ‌న అభిమానులు తెలుగు ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కౌబాయ్..అల్లూరి లాంటి పాత్ర‌ల‌తో కృష్ణ తెలుగు చిత్ర‌సీమ‌లో చెర‌గ‌ని సంతకం చేసుకున్నారు. ఇక‌ సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమాల‌తో పాటూ రాజ‌కీయాల‌లోనూ రానించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ప్ర‌ధాని రాజీవ్ గాంధీ కృష్ణ‌ను కాంగ్రెస్ లోకి ఆహ్యానించి కండువా క‌ప్పారు. మొద‌ట కృష్ణ రాజ‌కీయాల‌కు దూరం గా ఉన్న‌ప్ప‌ట‌కీ ఏపీలో ఎన్టీఆర్ లాంటి మాస్ లీడ‌ర్ కాంగ్రెస్ లోనూ ఉండాల‌ని రాజీవ్ గాంధీ కృష్ణ‌ను పార్టీలో చేర‌మ‌ని కోరారు.

Advertisement

అలా కాంగ్రెస్ లో చేరిన కృష్ణ ఎంపీగా సైతం ఎన్నిక‌య్యారు. కానీ రాజీవ్ గాంధీ మృతి త‌ర‌వాత కృష్ణ‌కు రాజ‌కీయాల‌పై పూర్తిగా ఆస‌క్తిపోయింది. దాంతో ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ లో ప‌నిచేసిన స‌మ‌యం నుండి ఏపీ దివంగ‌త‌ సీఎం వైఎస్ఆర్ తో కృష్ణ‌కు స‌న్నిహిత సంబంధాలు ఏర్ప‌డ్డాయి. అయితే త‌న‌కోసం ఓసారి వైఎస్ఆర్ ఢిల్లీ పెద్ద‌ల తో సైతం గొడ‌వ ప‌డ్డార‌ని కృష్ణ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Advertisement

సినిమా రంగంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గానూ 2009 లో ప‌ద్మ‌భూష‌న్ అవార్డుతో స‌త్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌కు ప‌ద్మ‌భూష‌న్ రావ‌డానికి కార‌ణం వైఎస్ఆర్ అని కృష్ణ వెల్ల‌డించారు. కూతురు మంజుల‌తో కృష్ణ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఆ చిట్ చాట్ లో త‌న‌కు వైఎస్ఆర్ వ‌ల్ల‌నే ప‌ద్మ‌భూష‌న్ వ‌చ్చింద‌ని తెలిపారు.

2009లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు మీకు ఇంత‌కాలం ప‌ద్మ అవార్డు రాలేదా అని బాధ‌ప‌డ్డారని చెప్పారు. అంతే కాకుండా ప‌ద్మ అవార్డుల కోసం అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ తో చర్చించి లిస్ట్ లో పేరు రాయించార‌ని చెప్పారు. మ‌రోవైపు వైఎస్ఆర్ కృష్ణ కోసం ఢిల్లీ పెద్ద‌ల‌తో ఫైట్ చేశార‌ని కూడా అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి.

Visitors Are Also Reading