Home » వైఎస్ భార‌తి పేరుతో వైర‌ల్ అవుతున్న ఉత్త‌రం.. అందులో ఏముందంటే..?

వైఎస్ భార‌తి పేరుతో వైర‌ల్ అవుతున్న ఉత్త‌రం.. అందులో ఏముందంటే..?

by Anji
Ad

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై ముఖ్యంగా నకిలీ వార్తలు ఎక్కువగా షేర్ అవుతూ ఉంటాయి. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఏపీ ప్రజలకు లేఖ రాసినట్లు వాట్సాప్ గ్రూపు ల్లో ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా లేక నకిలీ అనే దానిపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైఎస్ భారతి పేరు మీద సభ్యులే అవుతున్న ఉత్తరం అంటూ వైసీపీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ఉత్తరం భారతి రాసింది కాదని.. ఈ విషయం అందరూ గమనించాల‌ని కోరుతున్నామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Advertisement

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ సీపీ అభిమానులకు నా మనసులోని భావాలు ఆందోళన భయాలు చెప్పటానికి మొదటిసారి మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చినది. పొలిటికల్, పర్సనల్ గా ఎవరిని కామెంట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. వైయస్ జగన్ గెలిస్తే ఎవరికి ఏమి చేస్తాడు అని చెప్పటానికి రాలేదు. ఎవరు ఏ పథకాలను అమలు చేసినా అది వాళ్ళ అబ్బ సొత్తు కాదు మీ సొమ్ము మీకే ఇస్తున్నారు. కానీ నాయకుడు సమన్యాయం, దూరదృష్టి ఫలాలు అందరికీ అందేలా చేయాలంటూ వైఎస్‌ భారతి పేరు మీద ఒక నకిలీ వార్త వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది. ఇలాంటి ఉత్తరాలు వార్తలను ఒకటికి రెండు సార్లు నిజమా.? కాదా ? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read :  వరుడు తన వివాహ కార్డుపై అలాంటి గీతను ముద్రించడంతో ఆశ్చ‌ర్య‌పోయిన‌ పాఠకులు

Visitors Are Also Reading