Home » భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

by Azhar
Ad
సినిమా జీవితంలో హీరోయిన్స్ కు హీరోలకు ఉన్నంత ఎక్కువ లైఫ్ టైం ఉండదు. వారు ఒక్క సినిమాలో తాలూకు మని మెరిసి టాప్ హీరోయిన్  గా మారి వరుసగా ఐదు ఆరు సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగుతారు. ఆ తర్వాత అవకాశాలు తక్కువై సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా పోతారు. అలా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అందులో శాంతిప్రియ కూడా ఒక్కరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భానుప్రియ చెల్లెలుగా సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది శాంతిప్రియ.
1987లో ఓ తమిళ సినిమాతో తన సినీ జీవితాన్ని ఆరంభించిన శాంతిప్రియ అదే సంవత్సరం తెలుగులోకి అడుగు పెట్టింది. తెలుగులో మహర్షి రాఘవ హీరోగా వంశీ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ నిర్మించిన మహర్షి అనే సినిమాలో నటించింది శాంతిప్రియ. అందులో సుమం ప్రతి సుమం సుమం అనే పాట ఎంత ఫెమస్ అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సుంగద్ అనే సినిమాలో అక్షయ్ కుమార్ కు జోడిగా నటించింది.
ఆలా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచుకున్న శాంతిప్రియ వి. శాంతరామ్ మనవడు అయిన సిధార్థరామ్ ను 1999లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బాగా కలిసి మెలిసి ఉంటున్న వీరి జీవితంలో పెను విషాదం వచ్చింది. సిధార్థరామ్ 2004లో గుండెనొప్పితో మరణించాడు. దాంతో షాక్ లోకి వెళ్లిన శాంతిప్రియ దాదాపు 7 ఏళ్ళు ప్రపంచానికి దూరంగా ఎవరికీ కనిపించకుండా జీవించింది. ఆ తర్వాత మళ్ళీ 2011 లో మహా అక్షర్ హీరోగా నటించిన ఓ సినిమాలో ముఖ్య పాత్రలో నటించి మళ్ళీ అభిమానుల ముందుకు వచ్చింది శాంతిప్రియ.

Advertisement

Visitors Are Also Reading