Home » వ్య**చారం కేసుపై ఇప్పటికీ వేధిస్తున్నారు : నటి యమున

వ్య**చారం కేసుపై ఇప్పటికీ వేధిస్తున్నారు : నటి యమున

by Bunty
Ad

ప్రముఖ నటి యమున, గురించి తెలియని వారు ఉండరు. కర్ణాటకలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఆమె మౌనపోరాటం సినిమాతో ఈ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మామగారు, పుట్టింటి పట్టుచీర, ఎర్ర మందారం, బంగారు కుటుంబం, బ్రహ్మచారి మొగుడు తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2011లో నటి యమున బెంగుళూరులోని ఓ హోటల్ లో వ్య**చారం కేసులో పట్టిబడిందని వార్త అప్పట్లో సంచలనం రేపింది.

READ ALSO : గుండెపోటు ఉన్నవారు గుడ్డు తినవచ్చా… తింటే ఏమవుతుంది?

Advertisement

అయితే తాజాగా ఈ సంఘటనకు సంబంధించి చాలా దారుణమైన థంబ్ నెయిల్స్ తో మానసికంగా హింసిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది యమున. ‘హాయ్ అండి, నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా తెలియని ఓ బాధ అయితే నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అది కూడా సోషల్ మీడియా వల్ల. ఎందుకంటే నేను ఏళ్ళ క్రితమే ఓ సమస్య నుంచి బయటకు వచ్చే ప్రశాంతంగా ఉంటున్నాను. ఆ ప్రాబ్లంలో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేసాను.

Advertisement

READ ALSO : Shakib Al Hasan : అభిమానిని దారుణంగా కొట్టిన బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌

Actress Yamuna : నేనూ మనిషినే.. చనిపోయినా నన్ను వదలరా.. ఎమోషనల్ అయిన యమున-Actress Yamuna : నేనూ మనిషినే.. చనిపోయినా నన్ను వదలరా.. ఎమోషనల్ అయిన యమున - Telugu ...

 

 

ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చీట్ ఇచ్చి నన్ను గెలిపించింది. న్యాయపరంగా నేను విజయం సాదించాను. కానీ సోషల్ మీడియాను మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఆ థంబ్ నెయిల్స్ చూస్తే నేను చనిపోయిన కూడా నన్ను వీళ్లు వదలరు అనిపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది యమున. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమెకు మద్దతునిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

READ ALSO : “పవన్ కళ్యాణ్” వదిలేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీళ్లే!

Visitors Are Also Reading