Home » Waltair Veerayya : ఆ సెంటిమెంట్ మెగా అభిమానులకు భయం తెప్పిస్తోందా ?

Waltair Veerayya : ఆ సెంటిమెంట్ మెగా అభిమానులకు భయం తెప్పిస్తోందా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాల్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ (కే.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమా విడుదలవ్వబోతుంది. ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేందుకు మేకర్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఒక చోట మాత్రం అభిమానులకు నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోందట.

Waltair Veerayya

ముఖ్యంగా చిరంజీవి సినిమాలకు ఈ మధ్య టాక్ బాగున్నప్పటికీ వసూళ్లు లేకపోవడంతో మెగా అభిమానులు మరింత డల్ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాపై మెగా అభిమానులు ఎందుకు డౌట్ పడుతున్నారంటే.. ఈ సినిమాలో మరో హీరో రవితేజ నటించడమే. అదేంది.. చిరంజీవి సినిమాలో రవితేజ అంటే అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని చాలా మంచి భావిస్తారు. కానీ ఇటీవల చిరంజీవి సినిమాలను గమనించినట్టయితే ఆచార్య సినిమాలో చిరుతో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు  రాలేదు.

Advertisement

Advertisement

Also Read :   ఆర్ఆర్ఆర్ వాళ్లకు ఎందుకు నచ్చిందో తెలియదు.. రాజమౌళి వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Manam News

ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా కూడా ఫలితంలో తేడా కొడుతుందా అని సెంటిమెంట్ తో మెగా ఫ్యాన్స్ లో భయం మొదలైంది.  మరోవైపు సంక్రాంతి కానుకగా జనవరి 12న నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, తమిళ హీరో విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలు విడుదలవుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య  జనవరి 13న విడుదలవుతున్నట్టు సమాచారం. కానీ ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఈ రెండు సినిమాలు మెగాస్టార్ పోటీని తట్టుకుంటాడా అనే అనుమానాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి, బాలయ్య ఇద్దరి సినిమాలను నిర్మించింది కూడా మైత్రీ మూవీ మేకర్స్ కావడం విశేషం. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ మెగాస్టార్ సినిమా సెంటిమెంట్ ని కొనసాగిస్తుందో లేదో తెలియాలంటే మాత్రం.. విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

Also Read :  కేజీఎఫ్ చిత్ర నిర్మాణ బ్యానర్ లో మహానటి.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

Visitors Are Also Reading