Home » సమంత కొరియా నుంచి తిరిగివచ్చిన తరువాత నాగచైతన్యను కలువనుందా ? 

సమంత కొరియా నుంచి తిరిగివచ్చిన తరువాత నాగచైతన్యను కలువనుందా ? 

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న విషయం విధితమే. భారత్ తో పాటు పలు దేశాలలో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ప్రస్తుతం కొరియాలో ఉంది. అక్కడ ఈ వ్యాధికి చికిత్స అద్భుతంగా ఉందంటూ సమాచారం తెలియడంతో సన్నిహితులతో కలిసి సమంత అక్కడికి వెళ్లిందట. సమంత మేనేజర్ అధికారికంగా కొరియాకు చికిత్స నిమిత్తం వెళ్తున్నట్టుగా తెలియజేశాడు. 

Advertisement

దాదాపు రెండు వారాల పాటు సమంత అక్కడ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎన్ని రోజులనే విషయం పై క్లారిటీ లేదు. ఈ సమయంలోనే కొరియా నుంచి సమంత ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే నాగచైతన్యను కలవబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య నాగచైతన్యను సమంత కలిసే అవకాశాలున్నాయని ఇద్దరి మధ్య ఏదో  ఒక విషయంపై చర్చ జరుగబోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరూ కలువలేదు. ఇప్పుడు చికిత్స నిమిత్తం నాగచైతన్య వెళ్లి కలవాలని భావిస్తున్నాడట. ఆ విషయాన్ని సమంత మేనేజర్ కి కూడా చెప్పాడి.. సమంత ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది.  

Advertisement

Also Read :   ఎన్టీఆర్ కు 18 లక్షలు.. కృష్ణంరాజుకు 25 లక్షలు.. బొబ్బిలి బ్రహ్మన్న ఫ్లాష్ బ్యాక్..!!

samantha

ఇప్పటివరకు వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయం పై క్లారిటీ లేదు. వీరు కలిసి ఏం మాట్లాడుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది. అసలు వీళ్లు కలుస్తారా..? లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విడాకులకు సంబంధించిన వ్యవహారం మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇద్దరూ డైరెక్ట్ గా కలుసుకోవాల్సిన అవసరమేంటి అంటూ కొందరూ పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో రెండు వారాలు ఎదురుచూడాల్సిందే.  

Also Read :   రోజాకు ఈ వయసులో కూడా ఆ కోరిక మాత్రం తీరలేదట..!!

Visitors Are Also Reading