ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు తొమ్మిది ఏళ్ల నుంచి జడ్జీగా వ్యవహరిస్తున్న సీనియర్ హీరోయిన్ రోజా ఏపీ మంత్రి పదవీ చేపట్టడంతో గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రోజా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినా తరువాత ఆ స్థానం నుంచి చేయబోతుంది ఎవరంటూ చాలా రోజులుగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
ఇలాంటి సమయంలో బజర్దస్త్ షో నుంచి రోజా వెళ్లిపోవడంతో మళ్లీ నాగబాబు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజాకు, నాగబాబుకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే జబర్దస్త్ నుంచి ఆయన వెళ్లిపోయారనేది గతంలో వినిపించిన టాక్. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చేందుకు నాగబాబుకి పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, అభిమానులు అభిప్రాయపడ్డారు. అసలు విషయం ఏమిటంటే.. మల్లెమాల వారితో వచ్చిన గొడవ కారణంగా నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్లిపోయారు.
ఇప్పుడు అదే మల్లెమాల వారు జబర్దస్త్ను కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి నాగబాబు మళ్లీ జబర్దస్త్ కి వెళ్లే అవకాశం లేదు. రోజా పోయినా మరెవ్వరు వెళ్లిపోయినా కూడా జబర్దస్త్ నాగబాబు భుజాలకు ఎత్తుకునే అవకాశం లేదంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు ఇప్పటికే స్టార్ మా టీవీలో ప్రసరాం అవుతున్న కామెడీ స్టార్ జడ్జీగా నటించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. కాబట్టి జబర్దస్త్ కి వెళ్లే అవకాశం లేదంటూ.. మీడియాలో వస్తున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని నాగబాబు సన్నిహితులు పేర్కొనడం గమనార్హం.
Also Read :
మేకప్ తీయాల్సిందే.. తీయడం కుదరదు.. అయితే నేను పని చేయను..!
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం