Home » 7నెల‌లు కాపురం చేసి మోసం చేసిన భ‌ర్త‌…అత‌డి ఇంటి ముందే భార్య వినూత్న నిర‌స‌న‌..!

7నెల‌లు కాపురం చేసి మోసం చేసిన భ‌ర్త‌…అత‌డి ఇంటి ముందే భార్య వినూత్న నిర‌స‌న‌..!

by AJAY
Ad

భ‌ర్త లేదంటే ప్రియుడు మోసం చేస్తే భార్య‌లు ప్రియురాళ్లు అత‌డి ఇంటి ముందు నిర‌స‌న‌లు చేయ‌డం సాధార‌ణమే..అంతే కాకుండా మ‌హిళా సంఘాల‌తో క‌లిసి వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తారు. వీలైతా మ‌హిళా సంఘాల నేత‌ల‌తో క‌లిసి భ‌ర్త‌ల‌ను చిత‌క‌భాదుతారు. కానీ ఓ భార్య త‌న భ‌ర్త మోసం చేసాడంటూ వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపింది. అత‌డి ఇంటి ముందే ల‌క్ష్మీ దేవి ఫోటో మెట్ల‌పై పెట్టి పూజ‌లు చేయ‌డం మొద‌లు పెట్టింది. అంతే కాకుండా సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి పండ్లు ఫ‌లాల‌తో పూజ‌లు చేసింది.

Advertisement

దాంతో ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అయ్యింది. వివ‌రాల్లోకి వెళితే ఒడిస్సాలోని బరంపురంలోని బ్రహ్మనగర్ ప్రాంతానికి చెందిన డాక్ట‌ర్ సునిత్ సాహు అదే ప్రాంతానికి చెందిన త‌ల‌స్విని అనే యువ‌తిని ప్రేమించాడు. కొన్నేళ్ల ప్రేమ త‌ర‌వాత వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి త‌ర‌వాత ఏడు నెల‌ల పాటు భార్య‌ను భాగానే చూసుకున్న సునిత్ సాహు ఒక్క‌సారిగా భార్య‌ను విడిచిపెట్టి ఇంటి నుండి పారిపోయాడు. దాంతో భ‌ర్త త‌న‌ను వ‌దిలించుకోవాడానికే ఇంటి నుండి పారిపోయాడ‌ని గ్ర‌హించిన భార్య అత‌డి ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి నిర‌సన‌కు దిగింది.

Advertisement

త‌న భ‌ర్త‌ను త‌న‌కు ఇప్పించాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా భ‌ర్త త‌న‌తో వ‌చ్చేవ‌ర‌కూ క‌ద‌ల‌ను అంటూ అత‌డి ఇంటి ముందు మెట్ల‌పై ల‌క్ష్మి దేవి ఫోటో పెట్టి పూజ చేస్తూ నిర‌స‌న వ్యక్తం చేస్తోంది. ఇక ఆ మ‌హిళ‌కు మ‌హిళా సంఘాలు కూడా మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. వినూత్న రీతిలో మ‌హళ చేస్తున్న నిర‌స‌న‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో ఫేర్ చేయ‌గా ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading