Home » విజ‌య‌శాంతి “నిప్పుర‌వ్వ” త‌ర‌వాత బాల‌య్య‌కు నో చెప్ప‌డానికి ఆ గొడ‌వ‌లే కార‌ణ‌మా..!

విజ‌య‌శాంతి “నిప్పుర‌వ్వ” త‌ర‌వాత బాల‌య్య‌కు నో చెప్ప‌డానికి ఆ గొడ‌వ‌లే కార‌ణ‌మా..!

by AJAY
Ad

టాలీవుడ్ లో లేడీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ విజ‌య‌శాంతి. వ‌రుస లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో విజ‌యశాంతి లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన భ‌ర‌త్ అనే నేను అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా విజ‌య‌శాంతి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

VIJAYASHANTHI

Advertisement

తాను రాజ‌కీయాల్లోకి ఎందుకు రావాల్సివ‌చ్చింది. అనే విష‌యంతో పాటూ త‌న సినీజీవితం పై కూడా ఎన్నో విష‌యాల‌ను వెల్ల‌డించింది. ర‌జాకారుల వ‌ల్ల త‌మ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్న‌ట్టు విజ‌య‌శాంతి తెలిపింది. ర‌జాకారుల వ‌ల్ల ఏటూరు నాగారంలో ఉన్న త‌మ ఆస్తిమొత్తాన్ని వ‌దులుకుని త‌న తాత కుటుంబం మొత్తం చెన్నైకి పారిపోయిన‌ట్టు తెలిపింది.

mahesh babu vijayashanthi

Advertisement

త‌న తండ్రి ఆ త‌ర‌వాత ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వ‌చ్చార‌ని తాను కూడా హైద‌రాబాద్ లోనే జ‌న్మించాన‌ని చెప్పింది. త‌న త‌ల్లి నిజాం పాన‌ల‌, ర‌జాకార్ల గురించి చెప్ప‌డంతో తన మ‌న‌సులో రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ట్టు తెలిపింది. ఇక చిరంజీవి, బాల‌క్రిష్ణ తో తాను ఎక్కువ సినిమాలు చేశాన‌ని తెలిపింది. కాగా యాంక‌ర్ నిప్పుర‌వ్వ సినిమా త‌ర‌వాత బాల‌కృష్ణ తో మ‌ళ్లీ ఎందుకు సినిమాలు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించింది.

దానికి విజ‌యశాంతి మాట్లాడుతూ..ఆ త‌ర‌వాత త‌న రెమ్యున‌రేష‌న్ పెరిగింద‌ని త‌న‌కే హీరో ఇమేజ్ వ‌చ్చిన‌ట్టు తెలిపింది. అన్నీ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్లే తాను బాల‌య్య తో త‌ర‌వాత సినిమాలు చేయలేద‌ని చెప్పింది. త‌న‌కు ఇండ‌స్ట్రీలో హీరో ఇమేజ్ వ‌స్తుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని తెలిపింది. ఇప్ప‌టికీ తాను న‌మ్మ‌లేనంత‌గా ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అయ్యాన‌ని విజ‌య‌శాంతి పేర్కొంది. ఇదిలా ఉండ‌గా విజ‌య‌శాంతి బాల‌య్య మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని అందువ‌ల్లే ఆ త‌ర‌వాత విజ‌యశాంతి ఆయ‌న‌తో సినిమాలు చేయ‌లేద‌ని అప్ప‌ట్లో టాలీవుడ్ లో వార్త‌లు వినిపించేవి.

Visitors Are Also Reading