Home » త్రిష రాజమౌళి సినిమాను ఎందుకు మిస్ చేసుకుంది..?

త్రిష రాజమౌళి సినిమాను ఎందుకు మిస్ చేసుకుంది..?

by Sravanthi
Ad

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యకించి చెప్పక్కర్లేదు రాజమౌళి ఎంతోమంది హీరోలకి అద్భుతమైన హిట్లు ఇచ్చారు. పలువురిని పాన్ ఇండియా హీరోలుగా మార్చేశారు. రాజమౌళి తో లైఫ్ లో ఒక్క సినిమా చేయాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. టాప్ హీరోలు కూడా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేస్తే చాలు అనుకుంటుంటారు. హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. త్రిష ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకుంది. చాలామంది టాప్ హీరోల పక్కన కూడా నటించింది.

Advertisement

తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో నేటికీ తిరుగులేని నటిగా ఆమె ప్రస్తావని కొనసాగిస్తుంది. త్రిష పని అయిపోయిందిరా అన్న దగ్గర నుండి ఇంకో నాళ్ళ దాకా ఆమెకు డోకా లేదు అనిపించుకుంటున్నారు. ముందు కోలీవుడ్ లో ఆమె మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత నీ మనసు నాకు తెలుసు అని తెలుగు సినిమా ద్వారా పరిచయమైంది. ప్రభాస్ తో వర్షం సినిమా చేశాక ఆమె కెరియర్ మారింది. తర్వాత చాలా సినిమాల్లో ఆమెకి అవకాశం వచ్చింది. హీరోయిన్ గా అవకాశాలు దక్కుతున్న ఆ దశలో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆమె భావించింది.

Advertisement

rajamouli

Also read:

ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ అయ్యింది అనూహ్య కారణాలతో పెళ్లి రద్దయింది. ఇదిలా ఉంటే త్రిష రాజమౌళి సినిమాను మిస్ చేసుకుంది. సునీల్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్గా త్రిష నటించాల్సి ఉంది కానీ ఆ సినిమాకు ఆమె ఒప్పుకోలేదు. ఓ కమెడియన్ పక్కన చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. దీనితో జక్కన్న సలోనీని హీరోయిన్ గా పెట్టారు ఇలా ఈ విధంగా రాజమౌళి సినిమాను ఈమె మిస్ చేసుకుంది.

తెలుగు సినిమా  వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading