Home » త్రివిక్రమ్, పూరి బ్రతిమిలాడినా ‘దేశముదురు’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే…?

త్రివిక్రమ్, పూరి బ్రతిమిలాడినా ‘దేశముదురు’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే…?

by AJAY
Ad

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరికీ పూరి జగన్నాథ్ సూపర్ హిట్స్ అందించాడు. ఎన్టీఆర్ కు టెంపర్ సినిమా, మహేష్ బాబు కు పోకిరి , రామ్ చరణ్ కు చిరుత, పవన్ కళ్యాణ్ కు బద్రి లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు పూరి జగన్నాథ్ దేశముదురు లాంటి బ్లాక్ బస్టర్ ను అందించారు. అయితే నిజానికి దేశముదురు సినిమాకు ఫస్ట్ ఆప్షన్ అల్లు అర్జున్ కాదు అనే విషయం చాలా మందికి తెలియదు.

Advertisement

ఈ సినిమా కథను పూరీ మొదట హీరో సుమంత్ కు వినిపించారట. పూరి తో పాటు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా చేయాలని సుమంత్ కు సూచించారట. అయితే పూరి జగన్నాథ్ కథ మొత్తం రెడీ చేసుకోకుండానే సుమంత్ వద్దకు వెళ్లి హీరో సన్యాసిని ప్రేమిస్తాడు అంటూ జస్ట్ లైన్ మాత్రమే వినిపించారు. ఒక సన్యాసిని ప్రేమించడం ఏంటి అనే ఆలోచనలో సుమంత్ సినిమా వర్కవుట్ అవుతుందని రిజెక్ట్ చేశారు.

Advertisement

అనంతరం పూరి జగన్నాథ్ కథ పూర్తి చేసుకుని అల్లు అర్జున్ వద్దకు వెళ్లి పూర్తి కథ వినిపించారు. ఇక బన్నీకి పూరి కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసారు. అలా అల్లుఅర్జున్ దేశముదురు సినిమా లో హీరో గా ఎంపికయ్యారు. ఇక ఈ సినిమాలో లో హన్సిక హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్” మట్టే కదా…. అంటూ డైలాగులు చెప్పడం…బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలోని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అప్పట్లో ఈ సినిమా 90 థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడి అర్జున్ అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్ కి కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సుమంత్ ఈ సినిమాను మిస్ చేసుకుని నష్టపోయారని చెప్పాలి. ప్రస్తుతం సుమంత్ అడపాదడపా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading